కుమార్తెకు అప్పనంగా కాంట్రాక్టు: ఢిల్లీ ఎల్జీని తొలగించాలంటూ ఆప్ నేతలు

న్యూఢిల్లీ: ముంబైలోని ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టును తన కుమార్తెకు ఇచ్చేందుకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) చైర్మన్‌గా పనిచేస్తున్న సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. అంతేగాక, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను.. ప్రధాని నరేంద్ర మోడీని తక్షణమే తొలగించాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం కోరింది.

ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ కూడా సక్సేనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్జీ కుమార్తె శివంగి సక్సేన్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

AAP Demands PM Modi To Sack Delhi LG For Illegally Awarding Contract To Daughter, VK Saxena tweet counter.

'కళంకిత ఎల్‌జీని ఎందుకు ఉంచారని నేను ప్రధాని నరేంద్ర మోడీని అడగాలనుకుంటున్నాను. మీరు ఆయనను తొలగించాలి. ఎల్‌జీ రాజీనామా చేయాల్సి ఉంటుంది' అని సింగ్ అన్నారు.

"ఎల్జీ వీకే సక్సేనా, కేవీఐసీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో, తన పదవిని దుర్వినియోగం చేశారు, ముంబైలోని ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్‌ను తన కుమార్తెకు ఇచ్చాడు. కాంట్రాక్ట్ ఇవ్వడంలో, అతను కేవీఐసీ చట్టం 1961 నిబంధనలను ఉల్లంఘించారు ' ఆయన ఆరోపించారు.

"ప్రధాని వెంటనే మిస్టర్ సక్సేనాను ఢిల్లీ ఎల్‌జీగా తొలగించాలి, అతని కుమార్తెకు చట్టవిరుద్ధంగా కాంట్రాక్టు ఇచ్చినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ యాక్ట్ కుటుంబ సభ్యులకు పని ఇవ్వకూడదని చెబుతోందని, వారు ఈ చట్టాన్ని ఉల్లంఘించారని సింగ్ ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆప్ న్యాయవాదులను సంప్రదించి న్యాయపరమైన ఆశ్రయం తీసుకుంటుందని, గతంలో కెవిఐసి అధ్యక్షుడిగా ఉంటూ నోట్ల రద్దు సమయంలో అనేక కుంభకోణాలు, కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును తమ పార్టీ స్వాగతిస్తున్నదని, అయితే ఎల్‌జీపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని సింగ్ ప్రశ్నించారు.

కేవీఐసీ కాంట్రాక్ట్ ఆరోపణలపై ఢిల్లీ ఎల్జీ కార్యాలయం స్పందిస్తూ.. ముంబైలోని కెవిఐసి లాంజ్ అభివృద్ధిపై ఆప్ నాయకులు "నకిలీ గణాంకాలను ప్రచారం చేస్తున్నారు" అని ఆరోపించింది.

"ఒక రాజకీయ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్న నకిలీ గణాంకాలకు విరుద్ధంగా, ముంబై లాంజ్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 27.3 లక్షలు అని @kvicindia ఒక లేఖను విడుదల చేసింది' అని LG సెక్రటేరియట్ తన అధికారిక హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది.

ఖాదీ లాంజ్ ఇంటీరియర్ డిజైన్ ను సక్సేనా కుమార్తె చేసిన మాట వాస్తవమే అయినా.. ఉచితంగా చేశారని పేర్కొంది. దీని వల్ల కేవీఐసీకి లక్షల రూపాయలు మిగిలాయన్నారు. ఈ విషయంలో టెండర్ ఆహ్వానించడం గానీ, కేటాయించడం గానీ జరగలేదన్నారు.అయితే, దీనిపై సంజయ్ సింగ్ కూడా స్పందించారు.

సొంత కుటుంబ సభయులకు ఎలాంటి కాంట్రాక్ట్ గానీ, పని గానీ అప్పగించకూడదని కేవీఐసీ స్పష్టంగా చెబుతోందన్నారు. మా పార్టీలో ఒక నేత కంప్యూటర్ ఇంజినీర్ ఉన్నారని, ఉచితంగా చేసత్ానంటూ ఆయనకు సెంట్రల్ విస్తా ఐటీ వర్క్ అప్పగిస్తారా? ఇంకొకరు ఎంబీఏ చదివారు. ఉచితంగా చేస్తానంటూ ఆయనకు ప్రధాని కార్యాలయంలో మేనేజ్ మెంట్ వ్యవహారాలు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. అంతేగాక, సక్సేనా కుమార్తెకు వృత్తిపరంగా లబ్ది చేకూర్చేందుకు ఆవిష్కారం ఫలకంపై ఆమె కూరు కూడా ముద్రించారని ఆరోపించారు. సక్సేనాపై చర్యలు తీసుకునేందుకు తాము న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామని సింగ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+