277 ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 5500 కోట్లు: బీజేపీపై కేజ్రీవాల్, రేపే విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: బీజేపీపీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందన్నారు. కాగా, బీజేపీ 'ఆపరేషన్ కమలం' విఫలమైందని నిరూపించేందుకు అధికార ఆప్ ప్రభుత్వం సోమవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఒకరోజు పొడిగించారు.
అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ ఎమ్మెల్యే ఎవరూ ఫిరాయించలేదని నిరూపించేందుకు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెడతామన్నారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. మెజారిటీకి ఇంకా 28 మంది అవసరం. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు చర్య తీసుకోకుండానే ఆప్ నుంచి వైదొలగవచ్చు.
ఢిల్లీ, పంజాబ్లను గెలుచుకున్న ఆప్ దేశంలోనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ కావడం గమనార్మం. గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా వంటి బీజేపీ కంచుకోటలతో సహా ఇతర రాష్ట్రాల్లో ఆప్ అడుగుజాడలను విస్తరించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. 2012లో తాను స్థాపించిన పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోందని కేజ్రీవాల్ ఇటీవల చెప్పారు.
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధికార ఆప్ ఆరోపించడంతో శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. "గుజరాత్లో బీజేపీ కోట ప్రమాదంలో ఉంది. ఇప్పుడు శిథిలమై ఉంది. గుజరాత్లో రాబోయే ఎన్నికల కారణంగా మాపై ఈడీ, సీబీఐ దాడులు" అని ఆయన ఆరోపించారు.
We've calculated that 277 MLAs have come to their party (BJP), now if they would've given Rs 20 cr to each MLA then they've bought MLAs worth Rs 5,500 crores. That's why there's inflation as they're using all the money to buy MLAs at expense of common man:Delhi CM Arvind Kejriwal pic.twitter.com/furNBXgKp9
— ANI (@ANI) August 26, 2022
తన డిప్యూటీ మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించగా ఒక్క పైసా కూడా దొరకలేదని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో ప్రభుత్వాలను పడగొట్టారని, నగరంలో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని బీజేపీపై కేజ్రీవాల్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
277 ఎమ్మెల్యేలను రూ. 5500 కోట్లతో కొన్నారు: అరవింద్ కేజ్రీవాల్
ఆ పార్టీ (బీజేపీ)లోకి 277 మంది ఎమ్మెల్యేలు వచ్చారని లెక్కలు వేసుకున్నాం, ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఇస్తే రూ.5,500 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అందుకే ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, సామాన్యుల డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తున్నారు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.