చెన్నైలో కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సు బూడిద, సినిమా ఫక్కీలో 44 మంది ఎస్కేప్!
చెన్నై: బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరిన కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్ టీసీ) ఓల్వో బస్సు కాలి బూడిద అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా మంటలు వ్యాపించిన విషయం గుర్తించి నడిరోడ్డులో బస్సు నిలపివేసి అందులోకి ప్రయాణికులను కిందకు దించడంతో అందరూ ప్రాణాలతో బయపడ్డారు.
శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సులో 42 మంది ప్రయాణికులతో సహ ఇద్దరు డ్రైవర్లు చెన్నై బయలుదేరారు. శనివారం ఉదయం చెన్నైకి ఐదు కిలోమీటర్ల దూరంలోని పునామలై బైపాస్ రోడ్డులో బస్సు వెనుక నుంచి మంటలు వ్యాపించాయి.

వెనుక వాహనాలులో వెలుతున్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అప్పటికే మంటలు బస్సు పైభాగానికి వ్యాపించాయి. విషయం గుర్తించిన బస్సు డ్రైవర్ నడిరోడ్డులో బస్సు నలిపివేశారు. గట్టిగా కేకలు వేసి ప్రాయాణికులను కిందకు దిగిపోవాలని చెప్పాడు.

బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకుదిగారు. మంటలు వ్యాపించడంతో బస్సు వెనుక భాగంతో పాటు సీట్లు మొత్తం కాలి బూడిద అయ్యాయి. ఒక గంట తరువాత చెన్నై నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్యూట్ వలన మంటలు వ్యాపించాయని చెన్నై అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కేఎస్ఆర్ టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications