చెన్నైలో కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సు బూడిద, సినిమా ఫక్కీలో 44 మంది ఎస్కేప్!
చెన్నై: బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరిన కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్ టీసీ) ఓల్వో బస్సు కాలి బూడిద అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా మంటలు వ్యాపించిన విషయం గుర్తించి నడిరోడ్డులో బస్సు నిలపివేసి అందులోకి ప్రయాణికులను కిందకు దించడంతో అందరూ ప్రాణాలతో బయపడ్డారు.
శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కేఎస్ఆర్ టీసీ ఓల్వో బస్సులో 42 మంది ప్రయాణికులతో సహ ఇద్దరు డ్రైవర్లు చెన్నై బయలుదేరారు. శనివారం ఉదయం చెన్నైకి ఐదు కిలోమీటర్ల దూరంలోని పునామలై బైపాస్ రోడ్డులో బస్సు వెనుక నుంచి మంటలు వ్యాపించాయి.

వెనుక వాహనాలులో వెలుతున్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అప్పటికే మంటలు బస్సు పైభాగానికి వ్యాపించాయి. విషయం గుర్తించిన బస్సు డ్రైవర్ నడిరోడ్డులో బస్సు నలిపివేశారు. గట్టిగా కేకలు వేసి ప్రాయాణికులను కిందకు దిగిపోవాలని చెప్పాడు.

బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకుదిగారు. మంటలు వ్యాపించడంతో బస్సు వెనుక భాగంతో పాటు సీట్లు మొత్తం కాలి బూడిద అయ్యాయి. ఒక గంట తరువాత చెన్నై నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్యూట్ వలన మంటలు వ్యాపించాయని చెన్నై అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కేఎస్ఆర్ టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications