వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తొలిసారిగా థానే స్టేషన్‌లో ఏసీ టాయిలెట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోనే మొట్ట మొదటసారిగా భారతీయ రైల్వే స్టేషన్లో ఏసీ టాయిలెట్‌ను ఏర్పాటు చేసింది. శనివారం దీని ప్రారంభోత్సవం జరగనుంది. దీంట్లో పురుషుల విభాగంలో 30 యూరిననల్స్, 4 లెట్రిన్ల ఏర్పాటు చేశారు.

అదే విధంగా మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీగా ఉండే థానే స్టేషన్‌ను రోజుకు 7 లక్షల మంది సందర్శిస్తారు. ప్రస్తుతం థానే స్టేషన్ లో ప్రస్తుతం 3 టాయిలెట్లు ఉన్నాయి.

తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు. ఈ టాయిలెట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రాజన్ విచారే రానున్నారని తెలిపారు.

 AC toilet at Thane stn to open this Saturday

మొదటి హైస్పీడ్ రైలు కోసం 17 బోగీలు సిద్ధం:

ఇక ఢిల్లీ - ఆగ్రా మధ్య త్వరలో ప్రారంభించనున్న హైస్పీడ్ రైలు కోసం 17 బోగీలు సిద్దమయ్యాయని రైలు బోగీ తయారీ పరిశ్రమ అధికారులు గురువారం తెలిపారు. ఈ హైస్పీడ్ రైలు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో నడవనుంది.

ఎక్కువ స్పీడ్‌తో నడిచే రైలు కోసం తయారు చేసిన 17 బోగీలను ఉత్తర రైల్వేకు అప్పగించామని ఆర్సీఎఫ్ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఐతే ఢిల్లీ - ఆగ్రాల మధ్య ఈ హైస్పీడ్ రైలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది మాత్రం రైల్వే అధికారులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఆ బోగీలు ఢిల్లీకి చేరుకుంటాయన్నారు.

English summary
The Indian Railway's first deluxe air-conditioned toilet at Thane station will be opened on Saturday. The toilet has 30 urinals and four latrine facilities in the gents' section while it has six WC sections for women. It also has a facility for the disabled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X