ప్రభుత్వానికి కుచ్చుటోపీ, టీడీఆర్ స్కాంలో వాల్ మార్క్ కంపెనీకి ఏసీబీ షాక్, సోదాలు, దిమ్మ తిరిగింది !
బెంగళూరు: అభివృద్ది హక్కు బదిలి (టీడీఆర్) విషయంలో ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారని ఆరోపిస్తూ శనివారం బెంగళూరులో ఏసీబీ అధికారులు ఐదు ప్రాంతాల్లో దాడులు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రతన్ లాల్, అమిత్ బోళార్, గౌతమ్, మునిరాజప్ప తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ), బీడీఏ నుంచి వాల్ మార్క్ కంపెనీ అక్రమంగా టీడీఆర్ తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషంపై వాల్ మార్క్ కంపెనీ యజమాని రతన్ లాల్ కార్యాలయం, నివాసంలో ఏసీబీకి చెందిన ఎస్పీ, ఏసీపీ, డీఎస్పీలు సోదాలు చేస్తున్నారు. ఇందిరానగర, కేఆర్ పురంలోని వాల్ మార్క్ కంపెనీల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని రెసిడెన్సీ రోడ్డులోని రతన్ లాల్ నివాసంలో, హెచ్ఏఎల్ సమీపంలోని ప్రత్యేక కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. వాల్ మార్క్ కంపెనీ నుంచి ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని వాల్ మార్క్ కంపెనీ మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications