Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై దాడి చేసిన నక్సల్ నేత కేశవరావు మట్టు..! ఇక టార్గెట్ 2026 ?

2003లో తిరుపతిలోని అలిపిరి వద్ద అప్పటి సీఎం చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ కూడా అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా దళాలు తాజాగా మట్టుబెట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని దట్టమైన అబుజ్‌మడ్ అడవులలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో కేశవరావు చనిపోయాడు. దీంతో మావోయిస్టులకు అగ్రనాయకత్వం లేకుండా పోయింది.

దేశంలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ గా ఉన్న కేశవరావు తలపై కోటిన్నర నజరానా ఉంది. భద్రతా దళాలపై కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఎన్నో దాడుల్లో కేశవరావు కీలక పాత్ర పోషించాడు. శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 1955లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి స్కూలు టీచర్. స్వగ్రామం సమీపంలోని తలగంలో ప్రారంభ విద్య తర్వాత వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల (ప్రస్తుత నిట్ )లో ఇంజనీరింగ్ చదివాడు. కాలేజీ రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, తరువాత సీపీఐ (ఎంఎల్), పీపుల్స్ వార్ ద్వారా రాడికల్ రాజకీయాల్లోకి ఆకర్షితుడయ్యాడు.

after most-wanted naxal basavaraju s death centre eye 2026 moist-free india

మావోయిస్టు కావాలనే లక్ష్యంతో 1984లో అతను ఎంటెక్ చదువును మధ్యలో వదులుకున్నాడు. 1987లో శ్రీలంక వెళ్లి ఎల్టీటీఈ వద్ద గెరిల్లా యుద్ధ శిక్షణ కూడా తీసుకున్నాడు. అనంతరం వచ్చి 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన 2010 దంతెవాడ ఊచకోత, 27 మంది భద్రతా బలగాలను చంపిన 2013 జీరం ఘాటి ఆకస్మిక దాడి, చంద్రబాబుపై 2003 అలిపిరి పేలుడు, 2018లో అరకు లోయలో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ జంట హత్యలు చేసాడు. వినయ్, గంగన్న, ప్రకాష్, బిఆర్, ఉమేష్, కేశవ్ వంటి మారుపేర్లతో తిరిగాడు.

దశాబ్దాలుగా అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేశవరావును తాజాగా భద్రతా బలగాలు అబూజ్ మడ్ అడవుల్లో మట్టుబెట్టాయి. గణపతి పదవీ విరమణ తర్వాత 2018లో సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన కేశవరావు పట్టు పెంచుకున్నాడు. కేశవరావు మరణంతో రెడ్ కారిడార్ విస్తరణ యత్నాలకు భారీ దెబ్బ తగిలింది. దీంతో మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం అంటూ లేకుండా పోయింది. ఇదే ఊపు కొనసాగిస్తే భద్రతా బలగాలు వచ్చే ఏడాది చివరి నాటికి మావోయిస్టు రహిత భారత్ సాధించడం కష్టమేమీ కాదన్న వాదన వినిపిస్తోంది. అందుకే మోడీ, అమిత్ షా ఈ ఆపరేషన్ ను ప్రశంసిస్తున్నారు.

2026కి కౌంట్‌డౌన్ మావోయిస్టు కమాండ్ నిర్మాణం ఇప్పుడు విచ్ఛిన్నమైందని, మనుగడలో ఉన్న నాయకులు చిన్న చిన్న గ్రూపులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా చేసుకుని, 2025 చివరి నాటికి మిగిలిన నాయకత్వాన్ని నిర్మూలించడం లేదా బలవంతంగా లొంగిపోయేలా భద్రతా దళాలు పనిచేస్తున్నాయి. ఉన్నతాధికారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆపరేషన్ కేవలం వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు ఇది ఒక మానసిక మలుపు అని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+