కన్నీరు తెప్పిచ్చిన ఉల్లి ధరలు: ఇప్పుడు పెరిగిన పాల ధరల కూడా
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన ఉల్లిపాయల ధరలు సామన్యుడికి కంటతడి పెట్టిస్తుంటే.. ఇప్పుడు నిత్యావసరమైన పాల ధరలు కూడా పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా అన్ని పాల ఉత్పత్తుల సంస్థలు పాల ధరలను పెంచేశాయి. నిత్యావసరంగా ఉపయోగించే పాల ధరలు కూడా పెరగడంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది.
ఆమూల్, మదర్ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'విజయ'కూడా పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సప్లై తక్కువగా ఉండి.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

పెరిగిన 'విజయ' పాల ధర సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ ప్రకటించారు. దీని ప్రకారం ఒక లీటర్ పాల ధర రెండు రూపాయలు పెరుగుతోంది. డైట్ మిల్క్ లీటర్ 36 రూపాయల నుండి 38 రూపాయలకు పెరిగింది.
డబుల్ టోన్డ్ మిల్క్ ధర 38 రూపాయల నుండి 40 రూపాయలకు, టోన్డ్ మిల్క్ లీటర్కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు లీటర్కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెంచడం జరిగింది. ఓవైపు కూరగాయలు, ఉల్లి ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడికి పాల ధరలు పెరగడం మరో కొత్త భారం మీదపడినట్లయింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications