రాహుల్ నాయకత్వం మరోసారి అట్టర్ ఫ్లాప్: దిగ్విజయ్ ఏమన్నారంటే!..
ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాం
న్యూఢిల్లీ: ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాంధీ కటౌట్లు తొలగించేశారు.
మొత్తం మీద కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై మరోసారి ప్రశ్నలు ఎక్కుపెట్టింది. యూపీలో పార్టీ చిత్తవడంతో రాహుల్ నాయకత్వంపై జనాలకు నమ్మకం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ ను అదే స్థానంలో కొనసాగిస్తారా? భవిష్యత్ వ్యూహాలేంటి? వంటి అంశాలపై తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బలపడాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేని రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు సిద్దం చేస్తామని తెలిపారు.

పార్టీని పునర్మించడానికి, మరింత బలోపేతం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. నెహ్రూ-గాంధీ నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు బలంగా ఉందని, అందువల్లే ఇప్పుడు నాయకత్వం రాహుల్ కు వెళ్లిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహించదన్న వాదనను దిగ్విజయ్ కొట్టిపారేశారు. తనకు 31ఏళ్ల వయసులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ కులరాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ-ముస్లింల ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ, అమిత్ షా ప్లాన్ వేశారని మండిపడ్డారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications