రాహుల్ నాయకత్వం మరోసారి అట్టర్ ఫ్లాప్: దిగ్విజయ్ ఏమన్నారంటే!..
ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాం
న్యూఢిల్లీ: ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాంధీ కటౌట్లు తొలగించేశారు.
మొత్తం మీద కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై మరోసారి ప్రశ్నలు ఎక్కుపెట్టింది. యూపీలో పార్టీ చిత్తవడంతో రాహుల్ నాయకత్వంపై జనాలకు నమ్మకం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్ ను అదే స్థానంలో కొనసాగిస్తారా? భవిష్యత్ వ్యూహాలేంటి? వంటి అంశాలపై తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బలపడాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేని రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు సిద్దం చేస్తామని తెలిపారు.

పార్టీని పునర్మించడానికి, మరింత బలోపేతం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. నెహ్రూ-గాంధీ నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు బలంగా ఉందని, అందువల్లే ఇప్పుడు నాయకత్వం రాహుల్ కు వెళ్లిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహించదన్న వాదనను దిగ్విజయ్ కొట్టిపారేశారు. తనకు 31ఏళ్ల వయసులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ కులరాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ-ముస్లింల ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ, అమిత్ షా ప్లాన్ వేశారని మండిపడ్డారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications