పార్లమెంట్పై దాడి: అప్జల్ గురు ఉరిపై థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మాద్ అప్జల్ గురు ఉరితీయడాన్ని అత్యంత తప్పుగా ఘోరంగా నిర్వహించారని సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు.
కేరళలోని తిరువనంతపురంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. "అప్జల్ గురు ఉరిని తప్పు, ఘోరంగా నిర్వహించిందని నేను భావిస్తున్నాను. కుటుంబానికి ఒక హెచ్చరిక చేసి, చివరి సమావేశం నిర్వహించి శరీరం ఇచ్చి వుండాలి" అంటూ ట్వీట్ చేశారు.
. @pankajsrini I think the hanging was both wrong &badly handled. Family should have been warned, given a last meeting & body returned
— Shashi Tharoor (@ShashiTharoor) February 9, 2015 ఢిల్లోని తీహార్ జైల్లో ఫిబ్రవరి 9, 2013న యూపీఎ ప్రభుత్వ పాలనలో మహ్మాద్ అప్జల్ గురుని ఉరి తీసిన విషయం తెలిసిందే. జైలు ఆవరణలోనే అఫ్జల్ మృతదేహాన్ని అధికారులు ఖననం చేశారు. ఉరిశిక్ష అమలు చేసిన ప్రదేశానికి సమీపంలోని జైలు నెం.3 వద్ద ఖననం ప్రక్రియను పూర్తిచేసినట్లు జైలు అధికారు ఒకరు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లోని ఐదుగురు కాంగ్రెస్ శాసనసభ సభ్యులు అప్జల్ గురు ఉరిని తప్పుబడుతూ ప్రకటన చేసిన తర్వాత శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహ్మాద్ అప్జల్ గురుని ఉరి తీసిన సందర్భంలో తన కుటుంబ సభ్యులను అనుమతించి ఉండాల్సిందంటూ జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం అన్నారు.

అఫ్జల్ ఉరితీత విషయం అస్సలు మాకు తెలియదని, కేంద్రం లేఖ ద్వారా సమాచారం అందజేయలేదని ఆతని కుటుంబీకులు వాపోయిన సంగతి విదితమే. అప్జల్ గురు ఉరితీతను అధికారులు స్పీడ్ పోస్ట్ చేసినా, అతని కుటుంబానికి అది రెండు రోజులు తర్వాత అందింది.
తాము టీవీలో చూసి గురు ఉరిశిక్ష అమలు విషయాన్ని తెలుసుకున్నామన్నారు. తెలిసివుంటే అఫ్జల్ గురును చివరిసారిగా చూసివుంటామని, ఆతని చివరి కోరికనైనా తీర్చేవారిమని అఫ్జల్ గురు బంధువు ఆ సందర్భంలో యాసీన్ చెప్పారు.
అఫ్జల్ గురుకి ఉరి వేసి సోమవారం రెండవ వార్షికోత్సవం కావడంతో ఎలాంటి అల్లర్లు జరగక్కుండా చూసేందుకు అనేక మంది వేర్పాటువాదుల నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు సమస్యాత్మర ప్రాంతాలైన సాఫాకుదాల్, మహారాజ్ గుంజ్, రైనావారి, నౌవాట్టాలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లాలా చౌక్ ప్రాంతంలోని బిజినెస్ కాంప్లెక్స్కు భద్రాత దళాలను మోహరించారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications