Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: బ్లాక్ మనీతో ఆగ్రా కోటనే కొనేస్తున్నారు

ఆగ్రా: మనిషి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. నల్లకుభేరుల ఆట కట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంటే మేము చేసేది మేము చేస్తాం అంటు నల్ల కుభేరులు వారి వారి ఆలోచనల్లో వారు ఉన్నారు. అయితే నల్లధనంతో సంపాధించిన డబ్బు ఇప్పుడు ఎలా మార్చాలా అని వంద ఆలోచలను కాదు లక్షల ఆలోచనలు చేస్తున్నారు.

అపాయాన్ని దాటి బయటపడ్డాలంలే ఉపాయం కావాలంటారు పెద్దలు. ఇది సామెత కాదు అక్షరాల నిజం. పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరులు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు అనే విషం తెలిపిందే. వారి దగ్గర ఉన్న నగదు ప్రజా స్రవంతిలోకి తేవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగా చివరికి ఆగ్రాలోని పర్యాటక రంగంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, హోటల్ యజమానులు, ఇతర వ్యాపార వర్గాలు తమకు అందుబాటులో ఉన్న మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దానికి రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది.

Agra Fort is the former imperial residence of the Mughal Dynasty located in Agra.

ఆగ్రాలో తాజ్ మహల్, ఆగ్రా కోట, పతేపూర్ సిక్రీ ఉన్నాయి. వీటిలో ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ సందర్శనకు జారీ చేసే టిక్కెట్లు గత మూడు రెండు రోజులుగా భారీగా అమ్ముడవుతున్నాయి. ఆ వషయం కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు.

ఆగ్రా కోట సందర్శనకు టిక్కెట్ ధర రూ.530, అంతేకాకుండా ఒకసారి కొనుగోలు చేసిన టిక్కెట్ ఒక సంవత్సర కాలం పాటు చెల్లుబాటులో ఉంటుంది. అదే ప్రపంచ ప్రఖ్యాంతి పొందిన తాజ్ మహల్ సందర్శన టిక్కెట్ కేవలం రెండే రెండు రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటోంది.

అందువల్ల ఆగ్రా కోట సందర్శన టిక్కెట్లను భారీగా పాత రూ.1,000, రూ.500 నోట్లతో కొనేస్తున్నారు. అసలైన నిజమైన పర్యాటకులు తమ వద్ద తగిన కరెన్సీ లేకపోవడంతో హోటల్ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నార్నాని సమాచారం. సందర్శకుల సంఖ్య పెద్ద సంఖ్యలో తగ్గింది. అయినప్పటికీ టిక్కెట్లు భారీగా పెరుగుతుండటంతో ఆగ్రా అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఫతేపూర్ సిక్రి నగరం దగ్గర శుక్రవారం టిక్కెట్ల అమ్మకాలు సాధారణం కన్నా 10 రెట్లు పెరిగినట్లు భారతీయ పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా సగటున రోజుకు కొన్ని వందల టికెట్లు అమ్ముడు పోతుంటాయి. అయితే శనివారం ఎన్ని టిక్కెట్లు అమ్ముడు పోయాయి అనే విషయం తెలుసుకుంటే కచ్చితంగా షాక్ కు గురి కావాల్సిందే.

ప్రతి రోజూ కనీసం అంటే 950 టిక్కెట్లు విదేశీలు కొనుగోలు చేస్తుంటారు. గత మూడు రోజులుగా విదేశీయులు3,330 టిక్కెట్లు కొనెగోలు చేశారని వెలుగు చూసింది. పాత నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పర్యాటక రంగానికి లాభాలు తీసుకువస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+