ప్రభుత్వం సిద్ధం: అఖిలపక్ష సమావేశంలో మోడీ, 20రోజులపాటు పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపత్యంలో ఆదివారం పార్లమెంటు లైబ్రరీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. జమ్మూకాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న ఎంపీ ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంగా డిమాండ్ చేయడం గమనార్హం.
ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత పెరుగుదల, రైతాంగ సంక్షోభంపై విస్తృత చర్చ జరపాలని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి కోరారు. కాగా, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

ఈసారి కూడా సభ అత్యంత సమర్థంగా సాగాలని మోడీ ఆకాంక్షించారు. సభా నియమ, నిబంధనల ప్రకారం అన్ని రకాల అంశాల్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నిర్మాణాత్మక చర్చలు జరిగితే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచనలు చేయడంతో ఈ సమావేశం నిర్వహించారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు 20 రోజులపాటు ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశానికి మొత్తం 27 పార్టీలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లట్, కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్, ఎంపీ ఆనంద్ శర్మ, టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రియన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి హాజరయ్యారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications