అందరూ అలర్ట్, ఊడిపోయింది, జారిపోయింది అంటే కుదరదు, పవర్, పరువు రెండూ ముఖ్యం !
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచే ఎమ్మెల్యేలకు ఇతర పార్టీల నేతలు గాలం వేసే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం మీద కన్ను వేసిన మల్లికార్జున్ ఖార్గే ఆ రాష్ట్రం మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ఫోన్ లు చేసి మాట్లాడాడని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా తెలంగాణకు వెళతానని డీకే శివకుమార్ చెప్పారు.

ఇప్పటికే కె.చంద్రశేఖర్రావు నుంచి ఫోన్ వచ్చిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మల్ని తమ వద్దకు రమ్మని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద గెలిచే ఎమ్మెల్యేలకు అన్ని రాష్ట్రాల్లో గాలం వేసే అవకాశం ఉందని, ఈ విషయంలో నేతలంతా జాగ్రత్తగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అన్నారు.
ఓట్ల లెక్కింపును పర్యవేక్షించాలని ఇప్పటికే ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రాష్ట్రాల పరిశీలకులను, ఆ రాష్ట్రాల పార్టీల వ్యవహారాల ఇన్ చార్జ్ లను మల్లికార్జున్ ఖార్గే ఆదేశించారని తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందుగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ శనివారం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఇప్పటికే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం మధ్యప్రదేశ్లో బీజేపీ 47 శాతం ఓట్లతో 140 నుంచి162 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్కు 41 శాతం ఓట్లు రావడంతో 60-90 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇతరులకు 12 శాతం ఓట్లు రావడంతో 0 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా వేశారు.

ఇక మూడు ఎగ్జిట్ పోల్స్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు స్పష్టమైన విజయాన్ని అందించాయి. మరికొందరు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు చేరువలో ఉందన్నారు. ఇదిలావుండగా తెలంగాణలో గురువారం జరిగిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలన తర్వాత అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మెజారిటీని కోల్పోతుందని సర్వేలు అంచనా వేశాయి.
రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కోల్పోయే దాదాపు మూడు దశాబ్దాల సంప్రదాయం ఉన్న రాష్ట్రంలో విజేతల అదృష్టంలో తేడాలు ఉన్నాయి. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 4న రీషెడ్యూల్ చేసినట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటి నుంచి పలు ప్లాన్ లు వేస్తోంది.












Click it and Unblock the Notifications