రేణుకా చౌదరి షాపింగ్: కేంద్రమంత్రి, జడ్జి ఉన్న విమానం 45ని.లు ఆగింది
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ 45 నిమిషాలు ఆగింది. రేణుకా చౌదరి షాపింగ్ సరదా ఈ విమానాన్ని అంత సేపు విమానాశ్రయంలోనే నిలిచేలా చేసింది. దీంతో ప్రయాణికులలో కూర్చున్న కేంద్ర మంత్రి ఒకరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సదరు నాయకురాలు ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూడక తప్పలేదు.
గత శుక్రవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ మీదుగా చికాగో నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం 7 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఒక ప్రయాణికురాలు ఆలస్యంగా రావడంతో 45 నిమిషాలు ఆలస్యంగా విమానం గాల్లోకి లేచింది.

ఇంతకీ షాపింగ్లో మునిగిపోయి విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణమైన నాయకురాలు ఎవరా అని అందరు అనుకున్నారు. ఆమె కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరి ఈ ఆరోపణలను ఖండించారు. ప్రయాణికులను విమానాశ్రయం నుంచి విమానం దగ్గరికి చేర్చేందుకు ఉద్దేశించిన బండి మూలంగానే ఆలస్యమైంది తప్ప తను షాపింగ్ చేయలేదన్నారు. కొందరు కావాలనే తన పైన బురద జల్లుతున్నారన్నారు. తాను షాపింగ్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. కాగా, ఆలస్యం పైన ఎయిర్ ఇండియా విమానం విచారణకు ఆదేశించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications