ఇంజనీర్పై దాడి చేసి కాక్పిట్లో ఎయిర్ ఇండియా పైలట్
చెన్నై: ఎయిర్ ఇండియా విమానంలో పైలట్ విమానం ఇంజనీర్పై దాడి చేశాడు. కాక్ పిట్లో పైలట్ దాడికి దిగడంతో ఇంజనీర్కు గాయాలయ్యాయి. అతని ముక్కు నుంచి నెత్తురు కారడం ప్రారంభమైంది. దాడి చేసిన తర్వాత పైలట్ తనను తాను కాక్పిట్లో నిర్బంధించుకున్నాడు.

చెన్నై - ప్యారిస్ ఎఐ 143 విమానంలో శనివారం ఉదయం ఆ సంఘటన చోటు చేసుకుంది. ఇంజనీర్ కన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పట్టుబడుతున్నట్లు సమాచారం. దాంతో విమానం బయలుదేరడంలో రెండు గంటల జాప్యం జరిగింది. ప్రయాణికులు గొడవకు దిగడంతో ఎట్టకేలకు విమానం బయలుదేరింది.
ఇంజనీర్పై దాడి చేసిన పైలట్ మాణిక్లాల్ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు. ఇంజనీర్ను కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.












Click it and Unblock the Notifications