Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబాయ్ నీడ నుంచి 'మహారాష్ట్ర మాస్టర్ మైండ్' వరకు.. ముగిసిన అజిత్ పవార్ శకం!

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కీలక నేత అజిత్ పవార్(66) కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతిలో జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర రాజకీయాల 'బేతాజ్ బాద్‌షా'
అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించింది. తన బాబాయ్ శరద్ పవార్ నీడలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని 'దాదా'గా గుర్తింపు పొందారు.

ajit pawar passes away Maharashtra Deputy CM Dies in Plane Crash Political Era Ends Details

రాజకీయ ప్రస్థానం: బాబాయ్ వేలు పట్టి..
అజిత్ పవార్ 22 జులై 1959న అహ్మద్‌నగర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావు పవార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు. 1982లో శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత చక్కెర సహకార పరిశ్రమలో బాధ్యతలు చేపట్టారు. 1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే బాబాయ్ శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన ఎంపీ సీటును త్యాగం చేసి, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు.

ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఆరుసార్లు డిప్యూటీ సీఎం
అజిత్ పవార్ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అప్రతిహత విజయాలను అందుకున్నారు. 1995 నుంచి 2024 వరకు వరుసగా ఏడుసార్లు బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నేతగా రికార్డు సృష్టించారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేల హయాంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

బాబాయ్‌తో విభేదాలు - తిరుగుబాటు
2022లో శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకురావడంతో అజిత్ పవార్ అసంతృప్తికి లోనయ్యారు. 2023లో ఎన్సీపీ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరును, గుర్తును (గడియారం) దక్కించుకుని తాను నిజమైన ఎన్సీపీ వారసుడినని నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తన బలాన్ని చాటుకున్నారు.

వ్యక్తిగత జీవితం
అజిత్ పవార్‌కు భార్య సునేత్రా పవార్, ఇద్దరు కుమారులు పార్త్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత చదువు మధ్యలోనే ఆపేసిన అజిత్ పవార్, పట్టుదలతో రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+