దాద్రీ బాధితుని కుటుంబానికి రూ.45 లక్షల పరిహారం
లక్నో: ఆవును వధించి, మాంసాన్ని తిన్నారనే కారణంతో గ్రామస్తుల చేతిలో దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన బాధితుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే పరిహారాన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
ఆదివారం ఆయన లక్నోలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని సోదరులు ముగ్గురికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇల్లు, రక్షణ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం సహా అన్ని రకాలుగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీనిపై బాధితుని కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది.

హజ్ విషాదంలో 58కి చేరిన మృతులు
ఢిల్లీ: హజ్ యాత్రలో జరిగిన భారీ తొక్కిసలాటలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 58కి చేరింది. మరో 78 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంబంధిత వివరాలను ఆదివారం వెల్లడించారు.
గల్లంతయిన ప్రజల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. సౌదీ అధికారుల వివరాల ప్రకారం.. హజ్ యాత్రలో గత నెలలో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 769 మంది యాత్రికులు మృతి చెందారు. కాగా, ఈ దుర్ఘటనలో 1,036 మంది మరణించినట్లు విదేశీ అధికారులు, సమాచార మాధ్యమ సంస్థలు పేర్కొన్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications