Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూకశ్మీర్లో రేపే తొలి విడత పోలింగ్-24 సీట్లలో ఓటింగ్-ఇవన్నీ తొలిసారి..!

జమ్మూ కాశ్మీర్ గత పదేళ్లలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. రేపు (బుధవారం) 24 సీట్లలో తొలి విడత పోలింగ్ జరగబోతోంది. ఇందులో 16 నియోజకవర్గాలు కాశ్మీర్ పరిధిలోనూ, మరో 8 సీట్లు జమ్మూ పరిధిలోనూ ఉన్నాయి. మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రేపు తొలి విడత జరగబోతోంది. ఈ నెల 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరుగుతాయి.

తొలి విడత పోలింగ్ లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ , అవామీ ఇత్తెహాద్ పార్టీ పోటీలో ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గత పదేళ్లలో ఇక్కడ జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. దీంతో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది.

all set for first phase of jammu and Kashmir assembly election tomorrow-the poll of many firsts

జమ్మూ,కశ్మీర్ లో 2014, 2019, 2024లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో జమ్మూకశ్మీర్ పరిధిలోకి వచ్చే ఐదు ఎంపీ సీట్లలో సగటున గత 35 ఏళ్లలో అత్యధికంగా 58.46 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇక్కడి ప్రజలు తిరిగా రాష్ట్ర హోదాకు అనుకూలంగా ఓటేయబోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో రాజకీయంగా సుస్దిరత నెలకొనాలంటే ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. దీంతో ఈసారి ఓటింగ్ శాతంపైనా ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+