ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర లేనట్టే ... నిర్ణయం తీసుకున్న అమర్‌నాథ్ బోర్డు.. రీజన్ ఇదే !!

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో అమర్‌నాథ్ ఒకటి. ఇక్కడికి భక్తులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లాలంటే వీలుకాదు. హిమాలయాల్లో ఉండే కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అయితే కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వార్షిక అమర్‌నాథ్ యాత్ర తీర్థయాత్ర ఈ ఏడాది కూడా వరుసగా రెండో సంవత్సరం రద్దు చేయబడింది.

కరోనా దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు నిర్ణయం

కరోనా దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు నిర్ణయం

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో వార్షిక అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కాబట్టి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సంవత్సరం తీర్థయాత్ర నిర్వహించడం మంచిది కాదని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి వెళ్లాలని భావించే లక్షలాది మంది భక్తుల మనోభావాలు తెలుసు, వాటిని గౌరవిస్తూ వారి మనోభావాలను సజీవంగా ఉంచడానికి, పవిత్ర అమర్‌నాథ్ మందిరం నుండి ఉదయం మరియు సాయంత్రం హారతి యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని బోర్డు కొనసాగించాలి "అని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.

 అమర్ నాథ్ లో సాంప్రదాయ మత ఆచారాలు, పూజాధికాలు యధావిధిగా

అమర్ నాథ్ లో సాంప్రదాయ మత ఆచారాలు, పూజాధికాలు యధావిధిగా

వివరణాత్మక చర్చల తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వార్షిక తీర్థయాత్ర సింబాలిక్ మాత్రమే అని నిర్ణయించింది. ఏదేమైనా, అన్ని సాంప్రదాయ మత ఆచారాలు, పూజాధికాలు గత పద్ధతి ప్రకారం నిర్వహించబడతాయి. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు సీఈఓ నితీశ్వర్ కుమార్ మాట్లాడుతూ మేము కేంద్ర భూభాగం మరియు దేశంలో కోవిడ్ -19 పరిస్థితిని అంచనా వేస్తున్నాము. మా దృష్టి మహమ్మారిని కవ్యాప్తి అడ్డుకోవటం మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం పై సారించామని వెల్లడించారు. కానీ ఈ ఏడాది తీర్ధయాత్ర నిర్వహించబోమని వెల్లడించారు.

Recommended Video

    Tirupati Byelection : Pawan Kalyan పాద యాత్ర, బహిరంగ సభ ! || Oneindia Telugu
    ప్రతి ఏడు అమర్నాథ్ యాత్ర .. రెండేళ్లుగా కరోనా దెబ్బకు రద్దు

    ప్రతి ఏడు అమర్నాథ్ యాత్ర .. రెండేళ్లుగా కరోనా దెబ్బకు రద్దు

    హిమాలయాల ఎగువ ప్రాంతాలలో ఉన్న శివుడి 3,880 మీటర్ల ఎత్తైన అమర్నాథ్ మందిరానికి 56 రోజుల యాత్ర ప్రతి సంవత్సరం జూన్ 28 న పహల్గామ్ మరియు బాల్తాల్ జంట మార్గాల నుండి ప్రారంభమై ఆగస్టు 22 న ముగుస్తుంది. అయితే గతేడాది, మరియు ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమర్నాథ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+