కేంద్రం ఓపెన్ మైండ్తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాం
సంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరడం, చర్చల కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల నుంచి తొలగించవలసిన, వాటికి చేర్చవలసిన అంశాలేమిటో ప్రభుత్వానికి తెలియజేయాలంటూ రాసిన లేఖలపై రైతు సంఘాలు స్పందించాయి.
కరోనా వ్యాక్సిన్లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్
Recommended Video
వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాలు తిరస్కరించాయి. ఓపెన్ మైండ్ తో, నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని నేతలు విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం(వ్యవసాయ శాఖ) రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు. అనంతరం సాయంత్రం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.
చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అవాస్తవమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి.
జగన్ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ
కేంద్రం రాతపూర్వక హామీలతో రావాలని కోరుతున్నట్టు రైతులు చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలన్నారు. ఇలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామన్నారు. చర్చలు సక్సెస్ అయ్యేలా అనుకూల వాతావరణాన్ని కేంద్రమే సృష్టించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు చర్చలకు విముఖత చూపుతున్నారు.
అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్