పార్టీ ప్రక్షాళనపై రాహుల్ దృష్టి.. గుజరాత్ చీఫ్గా అమిత్ ఛావ్డా, త్వరలో మరిన్ని మార్పులు!?
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తమ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన రాహుల్ గాంధీ... చెప్పినట్లుగానే అమిత్ చవ్డా(35)కు గుజరాత్ పీసీసీ బాధ్యతలను అప్పజెపుతూ నిర్ణయం తీసుకున్నారు.
అంక్లవ్ నియోజవర్గం ఎమ్మెల్యే అయిన ఛావ్డా ప్రస్తుతం పార్టీ చీఫ్ విప్గా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తరువాత ఆ పార్టీ సీనియర్ నేత భరత్ సింహ్ సోలంకి గుజరాత్ పీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావించినప్పటికీ రాహుల్ గాంధీ వారించడంతో ఆయన తన రాజీనామాను వాయిదా వేసుకున్నారు.

తాజాగా మంగళవారం ఈ పదవిని రాహుల్ గాంధీ అమిత్ చవ్డాకు కట్టబెట్టారు.
ఇక పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్గా ఉన్న కొప్పుల రాజును కూడా తొలగించిన రాహుల్ గాంధీ ఆ స్థానంలో నితిన్ రౌత్ను నియమించారు. రాబోయే రోజుల్లో పార్టీలో పెనుమార్పులు తప్పవని, మిగిలిన రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల మార్పు కూడా జరగనుందని ఏఐసీసీ పేర్కొంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications