మమతకు చెక్... మంత్రులుగా బెంగాలీలో ప్రమాణ స్వీకారం చేయాండి..: అమిత్ షా
మరికాసెపట్లో జరగనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమంలో పశ్చిమబెంగాల్నుండి ఇద్దరు ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆ ఇద్దరు కూడ బెంగాలీ బాషలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వారు ప్రకటించారు. మాతృబాషలోనే ప్రమాణం చేపట్టాలని పార్టీ చీఫ్ అమిత్ షా చేప్పిన నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతో మమతను ఇరుకున పెట్టేందుకు ముందునుండే బీజేపీ పావులు కదుపుతోంది.
పశ్చిమబెంగాల్ నుండి దెబోశ్రీ చౌదరీ,బాబుల్ సుప్రియోలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వీరు తమ మాతృబాషలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు స్పష్టం చేశారు. సాధరణంగా ప్రమాణస్వీకారాన్ని ఇంగ్లీష్ లేదా హిందీలో చేస్తారు. కాని ప్రత్యేక బెంగాలీ బాషాలో చేయడానికి ఆ ఇద్దరు సిద్దమయ్యారు. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించినప్పుడే దెబోశ్రీ చౌదరి ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి లభిస్తుందని ముందే అమిత్ షా చెప్పారని ఆయన మాట ప్రకారమే మంత్రి పదవి లభించిందని ఆమే చెప్పారు. అయితే మంత్రిగా మాత్రం బెంగాలీ బాషలోనే చేయాలని చెప్పారని అన్నారు. దీంతో ఆమే బెంగాలీ బాషలో మంత్రిగా ప్రమాణ స్వీకార చేయనున్నట్టు చెప్పారు.
కాగా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య ఎత్తుకు పైఎత్తులు వేసుకున్నారు. బెంగాల్లో ఎలాగైన పాగా వేయాలని భావించిన నేపథ్యంలో మమతా బెనర్జిని బీజేపీని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో ఆపార్టీని రాజకీయకంగా దెబ్బతీసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఈనేపథ్యంలోనే బెంగాల్ నుండి బీజేపీ 18 సీట్లను గెలిచి మమతకు షాక్ ఇచ్చింది. దీంతో ఆ రాష్ట్ర్రం నుండి ఇద్దరికి కేంద్రమంత్రులుగా అవకాశం ఇచ్చారు.