జెఎన్యూలో రీసెర్చ్ స్కాలర్పై లైంగిక వేధింపులు, ప్రోఫెసర్పై కేసు
న్యూఢిల్లీ:జెఎన్యూలో మరో ప్రోఫెసర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్ధినులు తమపై ప్రోఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలతో ఆందోళన చేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయమై విద్యార్ధులు చేసిన నిరసన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఈ తరుణంలో తాజాగా మరో ఘటన వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది.
జెఎన్యూ ప్రోఫెసర్పై మహిళా పీహెచ్డీ స్కాలర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వర్శిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన మరో ప్రోఫెసర్పై మహిళా స్కాలర్ను బెదిరించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడిపై ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో జెఎన్యూలో ఈ తరహ ఘటనలు అధికంగా వెలుగు చూస్తున్నాయి. అయితే బాధితురాలు తమను సంప్రదిస్తే ఆమెను న్యాయం జరిగేందుకు తాము సహకరిస్తామని జెఎన్యూ విద్యార్ధి సంఘం ప్రకటించింది.
వర్శిటీలో ఏర్పాటైన లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి బాధితురాలు ఇంకా ఫిర్యాదు చేయలేదు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏబీవీపి నేత సౌరభ్ శర్మ పోలీసులను డిమాండ్ చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications