Anti CAA WAR:యూపీ భవన్ వద్ద ఉద్రిక్తత ..అదుపులో విద్యార్థులు ...ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో అటు రాజధాని ఢిల్లీ లోనూ , యూపీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో యూపీలో మృతుల సంఖ్య 16కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 23 కు చేరింది. గత ఐదు రోజుల నుంచి యూపీలో జరుగుతూనే ఉన్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు తీవ్రయత్నం చేస్తున్నా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో పౌరసత్వసవరణ చట్టంపై వ్యతిరేకత సందర్భంగా జరుగుతున్న ఆందోళనల నేపధ్యంలో పోలీసుల చర్యను నిరసిస్తూ కొంతమంది విద్యార్థులను దక్షిణ ఢిల్లీలోని యూపీ భవన్ వెలుపల ఆందోళనకు దిగారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక మరోవైపు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

యుపిలో హింసాకాండ కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రా, ఘజియాబాద్, వారణాసి, మధుర, మీరట్, మొరాదాబాద్, ముజఫర్ నగర్, బరేలి, ఫిరోజాబాద్, పిలిభిత్, రాంపూర్, సహారాన్పూర్, షామ్లీ, సంబ్లితో సహా అజమ్గర్ మరియు సుల్తాన్పూర్ లలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. అలీఘర్ జిల్లాలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. అక్కడ డిసెంబర్ 15న ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేశారు
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications