మోడీకి మాజీ సైనికోద్యోగుల బహిరంగ లేఖ: దళితులు, ముస్లింలపై దాడులపై ఖండన
దేశంలోని పలుప్రాంతాల్లో ముస్లింలు, దళితులపై చోటుచేసుకొంటున్న దాడులను నిరసిస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దాడులను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
న్యూఢిల్లీ: దేశంలోని పలుప్రాంతాల్లో ముస్లింలు, దళితులపై చోటుచేసుకొంటున్న దాడులను నిరసిస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దాడులను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
గో రక్షకుల పేరుతోనో, ఇతరత్రా కారణాలను చూపుతూ సాగుతున్న దాడుల పట్ల వారు తమ లేఖలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
దేశంలో ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. అకారణంగా చోటుచేసుకొంటున్న దాడులను వారు ప్రస్తావించారు. అంతేకాదు ముస్లింలు, దళితలను లక్ష్యంగా చేసుకొని చేసే దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ దాడులను ఖండించిన వారిని జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఈ తరహ ప్రచారాన్ని కూడ తాము ఖండిస్తున్నట్టుగా వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సుమారు 114 మంది మాజీ సైనికోద్యోగులు ఈ లేఖపై సంతకాలు చేశారు.