కారును అడ్డగించి దోపిడీ: నలుగురు మహిళలపై గ్యాంగ్రేప్, అడ్డొచ్చిన వ్యక్తి హత్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కొందరిని దోపిడీ చేసిన దుండగులు, ఆ తర్వాత కారులోని నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నోయిడా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న కొందరిని దోపిడీ చేసిన దుండగులు, ఆ తర్వాత కారులోని నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపేశారు.
జెవర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో బులంద్షహర్లోని బంధువుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రేటర్ నోయిడా సమీపంలోని ఢిల్లీ జాతీయ రహదారిపై వారి కారును అడ్డగించారు.

ముసుగులు ధరించిన ఆరుగురు వ్యక్తులు కారును ఆపి ప్రయాణికుల నుంచి నగదు, నగలు దోచుకున్నారు. కారులో ఉన్న నలుగురు మహిళలను బలవంతంగా బయటికి లాగి వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మహిళలను కాపాడేందుకు ప్రయత్నించిన అదే కుటుంబానికి చెందిన 45ఏళ్ల వ్యక్తిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications