నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన బీఎస్ఎఫ్
కోల్ కతా: అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) అరెస్టు చేశాయి. నిందితుల నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని మల్దా జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనలలో మొత్తం నలుగురు స్మగ్లర్లని అరెస్టు చేశామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ నుండి పిస్తోల్ లు తీసుకు వస్తున్న బుడేబ్ రాయ్, సైఫుల్ మండల్, నిర్మల్ సర్కార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు.

వీరి నుండి రెండు పిస్తోల్ లు, భారత్ కు చెందిన10 మొబైల్ సిమ్ కార్డులు, బైక్ స్వాదీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు నిందితులను అప్పగించామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ నుండి పిస్తోల్ లు ఎందుకు తీసుకు వచ్చారు అని ఆరా తీస్తున్నారు.
అదే విధంగా మరొ చోట రతన్ బిస్వాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను రూ. 84 లక్షల విలువైన 29 బంగారు బిస్కెట్ లు బంగ్లాదేశ్ నుండి తీసుకు వస్తున్నాడని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications