యువతిని రక్షించి, ఆకతాయిల దాడిలో జవాను బలి
మీరట్: ఆకతాయిల నుంచి టీనేజర్ను రక్షించే ప్రయత్నంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. దేశమంతటా స్వాతంత్ర వేడుగలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విషాధ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రాత్రి ఓ టీనేజర్ వెంట ఆకతాయిల గుంపు వెంటపడింది. 416 ఇంజనీరింగ్ బ్రిగేడ్కు చెందిన లాన్స్ నాయక్ వేద్ మిత్ర చౌధురి (35) హర్ దేవ్ నగర్ ప్రాంతం నుంచి పాలు తెచ్చుకునేందుకు వెళ్లాడు.

పాల దుకాణంలో యజమాని కుమార్తె కూర్చుని ఉంది. ఆ సమయంలో ఆమెను ఓ యువకుడు వేధిస్తుండటాన్ని చూశాడు. అతడిని వారించాడు. ఈ సమయంలో మాటామటా పెరిగింది. బాలికను వేధిస్తున్న యువకుడు ఆకాశ్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు కర్రలతో వచ్చారు.
వచ్చీరాగానే సైనికుడిపై దాడికి దిగారు. కర్రలతో చావబాదారు. తీవ్ర గాయాలపాలైన వేద్ మిత్రను సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. నిందితుడు ఆకాశ్తో పాటు, అతని స్నేహితులు సంజూ, రితీష్ లను అరెస్ట్ చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications