జమ్మూకాశ్మీర్లో ఆర్మీ వర్సెస్ టెర్రరిస్టులు; ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హతం!!
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా ముష్కరుల ఏరివేతను కొనసాగిస్తున్న భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తాజాగా మరో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను హతమార్చారు.

దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఎన్కౌంటర్
దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పోష్క్రీరి ప్రాంతంలో అధికారులు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. అనంత్నాగ్లోని పోష్క్రీరి గ్రామంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు మరియు భద్రతా దళాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, జాయింట్ సెర్చ్ పార్టీ అనుమానాస్పద ప్రదేశానికి చేరుకోవడంతో, దాక్కున్న ఉగ్రవాదులు జాయింట్ సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు భద్రతా బలగాలు ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. ఇది ఎన్కౌంటర్కు దారితీసింది అని పోలీసులు తెలిపారు.

ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాదులు హతం
ఇక ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. వారి మృతదేహాలను ఎన్కౌంటర్ స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. వారిని నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం)తో సంబంధం ఉన్న జబ్లిపోరా బిజ్బెహరా నివాసి డానిష్ అహ్మద్ భట్ అలియాస్ కోకబ్ దురీ మరియు ఫతేపోరా అనంత్నాగ్ నివాసి బషరత్ నబీ లోన్గా గుర్తించారు.

ఉగ్రవాద కార్యాకలాపాలలో, అనేకమంది పౌరులను హతమార్చిన కేసులలో నిందితులు
ఇద్దరు ఉగ్రవాదులు 2019 సంవత్సరం నుండి చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వారికి భద్రతా బలగాలపై దాడులు మరియు పౌర దౌర్జన్యాలతో సహా ఉగ్రవాద నేరాల కేసుల చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, సదూరా అనంతనాగ్ వద్ద మంజూర్ అహ్మద్ అనే ఇద్దరు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందిని హతమార్చడంలో కూడా వారు పాల్గొన్నారని తెలిపారు. జూలై 6, 2019న, మరియు మొహమ్మద్ సలీమ్ ఏప్రిల్ 9, 2021న బిజ్బెహరాలో ఉన్నారని అంతేకాకుండా, మే 29, 2021న జబ్లిపోరా బిజ్బెహరా ప్రాంతంలో ఇద్దరు పౌరులను హతమార్చడంలో వారి పాత్ర ఉందని అధికారులు తెలిపారు.

ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఒక AK-56 రైఫిల్, 35 AK రౌండ్లు, రెండు AK మ్యాగజైన్లు, ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్ మరియు రెండు పిస్టల్ రౌండ్లతో సహా పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఉగ్రవాదులను జల్లెడ పట్టడం కోసం పోలీసులు మరియు భద్రతా దళాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications