అర్నబ్ గోస్వామికి ‘వై’ కేటగిరి భద్రత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, టైమ్స్నౌ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ఆయనకు 'వై' కేటగిరి భద్రతను సమకూర్చింది. దీంతో అర్నబ్కు 24 గంటల పాటు భద్రతా వలయం ఉండనుంది.
మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణ కల్పించనున్నారు. కాగా, వీరిలో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉన్నారు. దీనిపై స్పందించేందుకు ఆర్నాబ్ అందుబాటులోకి రాలేదు.
'వై' కేటగిరి కింద రెండు రకాలుగా భద్రత కల్పిస్తుంటారు. మొదటి విభాగంలో మంత్రులకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఈ తరహా భద్రతను కల్పిస్తారు. రెండో విభాగంలో నిఘా వర్గాలు ఎవరికైనా ముప్పు ఉందని గుర్తిస్తే.. వారికి వై కేటగిరి భద్రతను కల్పిస్తారు.

భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో టీవీ షోల ద్వారా పాక్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆర్నబ్కు పలు ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్నబ్కు ప్రాణాపాయం పొంచి ఉందన్న సమాచారంతో ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పించింది.
ఇది ఇలా ఉంటే, జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుధీర్ చౌదరికి ఎక్స్ కేటగిరి, సమాచార్ ప్లస్కు చెందిన ఉమేష్ కుమార్ వై కేటగిరి, అశ్వినీ కుమార్ చోప్రాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అందిస్తున్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications