సరిహద్దు వెంబడి 300 మంది ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్ ఐజీ
శ్రీనగర్: సరిహద్దు వెంబడి పాకిస్థాన్ లాంచ్ ప్యాడ్ల వద్ద 250-300 మంది పాక్ ఉగ్రవాదులు పొంచివున్నారని బీఎస్ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. పాక్ ఉగ్ర చొరబాట్లను ఇప్పటికే భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు.
పాకిస్తాన్ ఇటీవల కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా పౌరులకు వారి ఆస్తులకు నష్టం కలిగించడంతో సహా చాలా హాని జరిగిందని మిశ్రా చెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు.

నవంబర్ 13న సరిహద్దుల వెంబడి పాక్ సైనికులు, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులతోపాటు మరో ముగ్గురు భారత పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. యూరీ సెక్టారులో ఇద్దరు సైనికులు మృతి చెందారు.
కాగా, గత కొద్ది నెలలుగా పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతుండగా, పాక్ ఉగ్రవాదులు మనదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. పాక్ చర్యలను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
ఆరుగురు భారతీయుల ప్రాణాలు తీసిన పాక్పై భారత్ ప్రతీకారం కూడా తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లోని పలు ఉగ్ర ఆయుధ ట్యాంకులపై భారత్ తేలికపాటి క్షిపణులను ప్రయోగించి ధ్వంసం చేసింది. దీంతో అనేక ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 8-10 మంది వరకు పాక్ ఉగ్ర, సైనికులు హతమైనట్లు తెలిసింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications