ఏకంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణై జైట్లీ నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకంలో భాగంగా గుజరాత్లోని వడోదర జిల్లాలో కర్ణాలి, పిపాలియా, వలీదా, బాగ్లీపురా గ్రామాలను దత్తత తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.
ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన' పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై స్వాతంత్య దినోత్సవ ప్రసంగం సందర్బంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా ఎంపీలు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తగిన నిధులను కేటాయిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల గ్రామాల్లో 2019 కల్లా సుమారు 2,500 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది మోడీ సంకల్పమని గుర్తు చేసుకున్నారు.
Today I adopted villages in the Karnali gram panchayat in Vadodara, Gujarat as part of the Sansad Adarsh Gram Yojna pic.twitter.com/ckgN8Qgvwi
— Arun Jaitley (@arunjaitley) January 11, 2015 Participating in Swachh Bharat Abhiyan, at village Karnali of Dabhoi taluka in Vadodara,on 11 Jan, 2015 pic.twitter.com/EbX7LYyuJq
— Arun Jaitley (@arunjaitley) January 11, 2015 











Click it and Unblock the Notifications