Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆలస్యమైనా అభినందిస్తున్నా .. ఐఏఎఫ్ దాడిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

హైదరాబాద్ : పాకిస్థాన్ పై వైమానిక దాడులను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సమర్థించారు. పుల్వామా దాడి జరిగిన రెండురోజుల్లోనే భారత్ దాడి చేస్తుందని భావించానని తెలిపారు. కాస్త ఆలస్యమైనా ఐఏఎఫ్ సేనలను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇకపై భారత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాడుల తర్వాత పాక్ పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. తన భూభాగంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే భారత్ మెరుపు దాడులు నిర్వహించిందని చెప్పారు.

asad praise the indain air force

ప్రభుత్వానికి మద్దతు
పాకిస్థాన్ చేపట్టిన దాడుల విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు అసదుద్దీన్. వాయుసే దాడులు సైనికేతర చర్య అని విదేశీ వ్యవహారాల శాఖ చెప్తుందని .. అయినా ప్రభుత్వం నుంచి ఒక విధాన నిర్ణయాన్ని ఇదివరకే ఊహించనని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఆటకట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దాడుల్లో అజార్ బావమరిది, సోదరుడు ఇబ్రంహీ అజార్, కశ్మీర్ ఆపరేషన్ విభాగ అధినేత ముఫ్తీ అజార్ మృతిచెందారు. ఇక మిగిలింది. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ అని .. వారిని తుదమొట్టించాలని కోరారు.

మారిన వ్యూహం
యురీ ఉగ్రదాడితో ప్రతీకార చర్యగా భూభాగం ద్వారా ఎల్ వో సీ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ దాడులు నిర్వహించారు. పుల్వామా దాడి తర్వాత భారత్ తన వ్యుహన్ని మార్చింది. గగనతలం నుంచి దాడి చేసి దుందుకుడిగా వ్యవహరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+