వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: రాష్ట్రాల మధ్య రక్తపాతం -మిజోరాం బోర్డర్‌లో 6గురు అస్సాం పోలీసులు హతం -అమిత్ షా ఎక్కడ?

|
Google Oneindia TeluguNews

ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు రక్తపాతానికి దారి తీశాయి. అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య తాజాగా తలెత్తిన సరిహద్దు గొడవల్లో భారీ హింస చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచి రెండు వైపులా పోలీసులు, వివిధ శాఖల అధికారులు, స్థానికులు, రైతులు పరస్పరం కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే..

Recommended Video

India Flooded with Love : Bihar People offering Food to Mizo Passengers in Train

viral video:రాష్ట్రాల మధ్య కాల్పులు -భయానక విధ్వంసం -సీఎంల మాటల యుద్ధం -అమిత్ షా చెప్పినాviral video:రాష్ట్రాల మధ్య కాల్పులు -భయానక విధ్వంసం -సీఎంల మాటల యుద్ధం -అమిత్ షా చెప్పినా

మిజోరాంతో సరిహద్దు ఘర్షణల్లో అస్సాం హోం శాఖకు చెందిన ఆరుగురు పోలీసులు బలయ్యారు. అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి తాజాగా చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసులు చనిపోయిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాకు తెలిపారు. ఇటు హిమంత, అటు మిజోరాం ముఖ్యమంత్రి జోరమంతుంగా వరుస ట్వీట్లు చేస్తూ, అమిత్ షాను ట్యాగ్ చేస్తున్నా కేంద్రం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి..

 Assam-Mizoram Border clashes: 6 Assam Cops Killed, said cm Himanta, amit shah to call

అస్సాం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి మిజోరాంలోకి ప్రవేశించి, పంటలు, పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెలను కాల్చిబూడిద చేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు భూభాగం అస్సాం కిందికి వస్తుందని, మిజోరాం ఆక్రమణకు పాల్పడిందని అస్సాం అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే అస్సాం పోలీసులు, ఇతర శాఖ అధికారుల వాహనాలపై మిజోరాం రైతులు దాడికి పాల్పడ్డారు.

జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామజగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ

 Assam-Mizoram Border clashes: 6 Assam Cops Killed, said cm Himanta, amit shah to call

ఘర్షణల్లో తుపాకులు, నాటు బాంబులు వాడుతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. పోలీసుల మరణాలు కాల్పుల వల్లే జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. దాడికి పాల్పడింది మీరంటే మీరేనంటూ అస్సాం, మిజోరాం ముఖ్యమంత్రులు ట్విటర్ లో మాటల యుద్ధం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎంలతో కీలక మీటింగ్ నిర్వహించిన మరుసటి రోజే అస్సాం-మిజోరాం మధ్య గొడవలు చెలరేగడం గమనార్హం.

English summary
Six police officers from Assam were killed in the fresh violence that broke out today at the disputed Assam-Mizoram border, Assam Chief Minister Himanta Biswa Sarma has said. There were reports of firing from the border area -- which lie over Assam's Cachar district and Mizoram's Kolasib district -- and attacks on government vehicles. The Chief Ministers of the two states had clashed on Twitter, and tagged Mr Shah in their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X