వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం ఎన్సార్సీ అమల్లో మరో ట్విస్ట్‌- జాబితా మార్పు కోసం సుప్రీంకు బీజేపీ సర్కార్‌

|
Google Oneindia TeluguNews

భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం ఎన్సార్సీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా రికార్డులకెక్కిన అస్సోంలో ప్రభుత్వం ఇప్పుడు పునరాలోచనలో పడింది. గతంలో తాము రూపొందించిన జాబితా ప్రకారం ఏకంగా 19 లక్షల మంది విదేశీయులుగా తేలడంతో వీరంతా కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ జాబితాలో సవరణలకు అనుమతించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.

అస్సోంలో ఎన్సార్సీ అమలు ద్వారా 19 లక్షల మంది విదేశీయులుగా తేలారు. వీరంతా తమ వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో పౌరులుగా గుర్తింపు కోసం విదేశీ ట్రైబ్యునల్స్‌ను ఆశ్రయించారు. కానీ వీరిలో చాలా మంది ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్‌ ఇప్పుడు వారిని బుజ్జగించేందుకు ఆ జాబితాలో సవరణలకు సిద్దమవుతోంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో ఆ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది.

Assam NRC: State Coordinator Moves SC seeking comprehensive, time bound re-verification of draft NRC

గతేడాది జూలైలో అస్సోం ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ఎన్నార్సీ జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సమన్వయకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ జాబితాను సమగ్రంగా మారుస్తామని, ఆ తర్వాత ని్ర్ణీత కాలవ్యవధిలోగా దీన్ని అమలు చేసేందుకు వీలుగా అనుమతి మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్ధించారు. దీంతో ఎన్సార్సీ అమలు వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

English summary
Assam NRC list which was released on July 2020 left out out about 1.9 million people from the register. These people were to file appeals at foreigners’ tribunals to prove their citizenship. Now State govt is approaching SC for redoing the exercise
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X