ఫ్రాన్స్ దేశస్తుడిని చితకబాదారు: మనీపర్స్, మొబైల్ లాక్కున్నారు
బెంగళూరు: భారత పర్యటన కొసం వచ్చిన విదేశీయుడి మీద దాడి చేసిన కేసులో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కలాసిపాళ్యలో ఒక ప్రయివేటు ట్రావెల్స్ దగ్గర పని చేస్తున్న మహమ్మద్ ఖాన్, కుమార్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.
ఫ్రాన్స్ కు చెందిన పినో అనే వ్యక్తి కొంత కాలం క్రితం భారత్ లో పర్యటించడానికి టూరిజం వీసా తీసుకుని వచ్చాడు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంచరించి బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సంచరించాడు. కేరళలోని మున్నార్ వెళ్టడానికి సిద్దం అయ్యాడు.

కలాసిపాళ్యలోని ప్రయివేటు ట్రావెల్స్ లో కేరళలోని మున్నార్ వెళ్లడానికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో పినో కలాసిపాళ్యలోని ట్రావెల్స్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో బస్సులో లగేజ్ పెట్టే సమయంలో పినోతో మహమ్మద్ ఖాన్, కుమార్ గొడవ పెట్టుకున్నారు.
ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. తరువాత సహనం కొల్పోయిన ఇద్దరు పినోమీద దాడి చేసి చితకబాదారు. అతని దగ్గర ఉన్న విలువైన మొబైల్, మని పర్స్ లాక్కోన్నారు. పినో ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications