ఫ్రాన్స్ దేశస్తుడిని చితకబాదారు: మనీపర్స్, మొబైల్ లాక్కున్నారు
బెంగళూరు: భారత పర్యటన కొసం వచ్చిన విదేశీయుడి మీద దాడి చేసిన కేసులో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కలాసిపాళ్యలో ఒక ప్రయివేటు ట్రావెల్స్ దగ్గర పని చేస్తున్న మహమ్మద్ ఖాన్, కుమార్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.
ఫ్రాన్స్ కు చెందిన పినో అనే వ్యక్తి కొంత కాలం క్రితం భారత్ లో పర్యటించడానికి టూరిజం వీసా తీసుకుని వచ్చాడు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంచరించి బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సంచరించాడు. కేరళలోని మున్నార్ వెళ్టడానికి సిద్దం అయ్యాడు.

కలాసిపాళ్యలోని ప్రయివేటు ట్రావెల్స్ లో కేరళలోని మున్నార్ వెళ్లడానికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో పినో కలాసిపాళ్యలోని ట్రావెల్స్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో బస్సులో లగేజ్ పెట్టే సమయంలో పినోతో మహమ్మద్ ఖాన్, కుమార్ గొడవ పెట్టుకున్నారు.
ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. తరువాత సహనం కొల్పోయిన ఇద్దరు పినోమీద దాడి చేసి చితకబాదారు. అతని దగ్గర ఉన్న విలువైన మొబైల్, మని పర్స్ లాక్కోన్నారు. పినో ఫిర్యాదు చెయ్యడంతో ఇద్దరిని అరెస్టు చేశామని కలాసిపాళ్య పోలీసులు తెలిపారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications