Aunty: రెండేళ్ల క్రితం ఆంటీ ఎస్కేప్, ఐదు రోజుల ముందు ప్రత్యక్షం, కొడుకుతో కలిసి భర్తను నరికి చంపేసి!
అబోహర్/ పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకును పెంచి పెద్ద చేశారు. దంపతుల కొడుక్కి ప్రస్తుతం పెళ్లి వయసు వచ్చింది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.
దంపతుల మద్య తేడాలు రావడంతో రెండు సంవత్సరాల క్రితం భార్య ఆమె భర్తను వదిలేసి వెళ్లిపోయింది. ఇటీవల భార్య మళ్లీ ఆమె భర్త దగ్గరకు వచ్చింది. దంపతుల మద్య మళ్లీ గొడవలు మొదలైనాయి. దంపతులకు వాళ్ల బంధువులు సర్దిచెబుతూ వస్తున్నారు. అయితే రాత్రి భార్య ఆమె కొడుకుతో కలిసి భర్తను దారుణంగా చంపేయడం కలకలం రేపింది.
25 ఏళ్ల క్రితం పెళ్లి
పంజాబ్ లోని అబోహర్ జిల్లాలోని బొంపూర్ గ్రామంలో రామ్ రతన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన రేష్మా దేవి అలియాస్ రేష్మా అనే మహిళను రామ్ రతన్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రామ్ రతన్, రేష్మా దేవి దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.
భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్య
రామ్ రతన్ , రేష్మా దంపతులకు భజన్ లాల్ (22) అనే కొడుకు ఉన్నాడు. కొడుకు రతన్ లాల్ ను ఇంతకాలం పెంచి పెద్ద చేశారు. రేష్మా, రామ్ రతన్ దంపతుల కొడుక్కి ప్రస్తుతం పెళ్లి వయసు వచ్చింది. అయితే రానురాను రామ్ రతన్, రేష్మా దేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రేష్మా, రామ్ రతన్ దంపతుల మద్య తేడాలు రావడంతో రెండు సంవత్సరాల క్రితం రేష్మా ఆమె భర్తను వదిలేసి వెళ్లిపోయింది.
భర్త ఇంట్లో ప్రత్యక్షం అయిన భార్య
రెండు సంవత్సరాల నుంచి రేష్మా దేవి ఆమె భర్త రామ్ రతన్ ఇంటి వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఐదు రోజుల క్రితం రేష్మా మళ్లీ ఆమె భర్త రామ్ రతన్ దగ్గరకు వచ్చింది. రామ్ రతన్, రేష్మా దంపతుల మద్య మళ్లీ గొడవలు మొదలైనాయి. రామ్ రతన్, రేష్మా దంపతులకు వాళ్ల బంధువులు సర్దిచెబుతూ వస్తున్నారు. అయితే గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
కొడుకుతో కలిసి భర్తను చంపేసిన ఆంటీ
రాత్రి రేష్మా దేవి ఆమె కొడుకు భజన్ లాల్ తో కలిసి ఆమె భర్త రామ్ రతన్ ను దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది. రామ్ రతన్ హత్య కేసులో అతని భార్య రేష్మా దేవి, కొడుకు భజన్ లాల్ ను అరెస్టు చేశామని, హత్యకు కచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదని సీనియర్ పోలీసు అధికారి దినేష్ శరణ్ అంటున్నారు. కొడుకుతో కలిసి రేష్మా ఆమె భర్తను హత్య చెయ్యడం కలకలం రేపింది.