ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయండి: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.

అంతేగాక, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను.. తమ అనుమతి లేకుండా బదిలీ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ayesha meera murder case: high court orders to re probe with sit

2007, డిసెంబర్‌ 27న బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్‌లో హత్యకు గురయింది. వసతి గృహంలోని బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన అక్కడివారు పోలీసులకు సమాచారమిచ్చారు.

మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+