ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.
అంతేగాక, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులను.. తమ అనుమతి లేకుండా బదిలీ చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

2007, డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని హాస్టల్లో హత్యకు గురయింది. వసతి గృహంలోని బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన అక్కడివారు పోలీసులకు సమాచారమిచ్చారు.
మృతదేహం పక్కన ఓ లేఖ ఉంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications