Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ayodhya Ram temple: ఆర్ధిక వ్యవస్ధకు ఊతంగా అయోధ్య రామాలయం- అంచనాలివే..!

అయోధ్యలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న రామమందిరం మహాసంప్రోక్షణ, ప్రాణప్రతిష్టలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముతో పాటు పలువురు దేశ విదేశీ ప్రముఖులు, లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈ మహా ఘట్టం జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమం తర్వాత అయోధ్య రామాలయం కేవలం భక్తులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా కనకవర్షం కురిపించబోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్ధిక వ్యవస్ధకు ఊతకర్రగా మారనుందన్న అంచనాలున్నాయి.

తాజాగా ప్రధాని మోడీ అయోధ్యలో పర్యటించి ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను, కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టును ప్రారంభించారు. అదే రోజు రూ.15 వేల విలువైన ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేశారు. అయోధ్య నగరంలో రామాలయ సముదాయంతో పాటు, అయోధ్య అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మార్పులు సహజంగానే నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా, నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుందన్న అంచనాలున్నాయి. ఇది పొరుగున ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు తేనుంది.

Ayodhya Ram temple development to be an economic boost- here are details...

మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం అయోధ్యలో తాజాగా జరుగుతున్న అభివృద్ధి వేగం చూస్తుంటే ఈ నెలలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత పదేళ్లలో 85 వేల కోట్ల పెట్టుబడులతో ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది భక్తుల్ని ఇక్కడికి రప్పించబోతోందని అంచనా. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో ప్రస్తుత మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లతో సహా అభివృద్ధి పుంజుకోనుంది.

ఈ విజన్‌లో 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు అయోధ్యకు ఉన్నాయని, అదే సమయంలో చరిత్ర, సంస్కృతికి కేంద్ర బిందువుగా కూడా ఉండబోతోందని చెప్తున్నారు. తాజా అంచనాల ప్రకారం రామమందిరం పూర్తి తర్వాత నగరంలో నివాసితులు, పర్యాటకుల నిష్పత్తి 1:10గా ఉండబోతోంది. ఇందుకోసం గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో స్టేట్ గెస్ట్ హౌస్‌లు, అన్ని రకాల సందర్శకులను తీర్చడానికి హోటళ్లు, అవసరాలను తీర్చడానికి వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు.

31,662 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నగరానికి కొత్త రూపాన్ని, అనుభూతిని అందించడానికి మొత్తం 37 రాష్ట్ర, జాతీయ ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ రూ. 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తుండగా, యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం రూ.7,500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. విమానాశ్రయం, రైల్వేలు, హైవేలు ఈ నవీకరణలో కీలక భాగాలుగా ఉన్నాయి. అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపనకు ముందు ఎఫ్‌ఎంసిజి కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్‌లు అయోధ్య కోసం బీలైన్‌ను తయారు చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, సందర్శకుల జనాభాలో 8-10 రెట్లు పెరుగుదల నమోదు చేయబోతోందని అంచనా. తాజ్, రాడిసన్, ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ 5-స్టార్ బ్రాండ్‌ల నుండి ఓయో వంటి బడ్జెట్ ప్లేయర్‌ల వరకు, కంపెనీలు కొత్త హోటల్‌లను తెరవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నాయి. ఇదంతా ఆర్ధిక వ్యవస్ధను కొత్త మలుపు తిప్పబోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+