ayodhya verdict:అశోక్ సింఘాల్కు భారతరత్న: సుబ్రమణ్య స్వామి డిమాండ్.. ఎందుకంటే!
ఏళ్ల నాటి అయోధ్య భూ వివాదం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమి రామ్ న్యాస్కే చెందుతుందని వెల్లడించింది. దీంతో అయోధ్యలో రాముడి ఆలయం నిర్మించాలని ఉద్యమించిన నేతలను ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అద్వానీ, అశోక్ సింఘాల్, గోవిందాచార్య ఇతర నేతలు చేపట్టిన పోరాటాన్ని బీజేపీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు.
ఒకడుగు ముందుకేసిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వహిందూ పరిషత్ అగ్రనేత, దివంగత అశోక్ సింఘాల్కు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించేందుకు సింఘాల్ పాటుపడ్డారని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ 1990లో చేపట్టిన రథయాత్రతో రాముని ఆలయం కట్టాలనే డిమాండ్ ప్రారంభమైంది. రథయాత్ర వ్యుహారచనలో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య ఒకరు. వీరికి సింఘాల్ సహకరించారని పేర్కొన్నారు.

అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే గోవిందాచార్య స్పందించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడుగులు పడటదానికి అశోక్ సింఘాల్, అద్వానీ కారణమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చివరికి మూడునెలల్లో రామాలయ నిర్మిస్తామని సంతోషంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో విర్రవీగిపోమని.. సామరస్యంతోనే మెలుగుతామని ఆయన చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఇక రామరాజ్యం ఆవిర్భవించబోతుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కారణం మాత్రం సింఘాలేనని సుబ్రమణ్యస్వామి అన్నారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలని కోరారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications