Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గిర్ అరణ్య రోదన: బబేసియోసిస్ బారినపడి 23 సింహాల మరణం

గాంధీనగర్: ఆసియా సింహాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సింహాల వరుస మరణాలు ఆందోళనకరంగా మారాయి. గత మూడు నెలల్లోనే 23 సింహాలు మరణించాయి.

ప్రొటోజోవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియోసిస్ వల్లే సింహాలు మృత్యువాతపడుతున్నాయని జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ తెలిపారు. బ్లడ్ ప్రొటోజోవా పారాసైట్‌ను బబేసియోసిస్ అని పిలుస్తారని, ఇది కొన్ని విష పురుగులు, కీటకాలు కుట్టడం ద్వారా కూడా వస్తుందనిన్నారు.

Pride in danger: Babesiosis outbreak claims lives of 23 lions in Gujarat’s Gir forest.

అయితే ఇది అంటు వ్యాధి కాదని, దీనికి చికిత్స ఉందని సదరు అధికారి తెలిపారు. జాటీయ పార్కులో పెద్ద సింహాలన్నీ చనిపోయాయని, వ్యాధి బారినపడ్డ ఒక జంతువును తినడం వల్లే వీటికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని చెప్పారు.

సింహాల మరణంపై దర్యాప్తు కొనసాగుతోందని, నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బబేసియా సోకిన మరో 18 సింహాలకు చికిత్స అందజేస్తున్నారు. జసాధర్ జంతు చికిత్స కేంద్రం వీటికి చికిత్స చేస్తోంది.
కాగా, పలు సింహాలు తమలో తాము కలహించుకుని, మునిగిపోయి, వృద్ధాప్యం, పాము కాట్లతో చనిపోయాయని వాసుదేవ తెలిపారు.

కాగా, గిర్ అరణ్యంలో సింహాలు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్, ప్రోటోజోవా పారసైట్ కారణంగా దాదాపు 25 సింహాలు మరణించాయని, ఆ తర్వాత అమెరికా నుంచి కానైన్ డిస్టెంపర్ వైరస్(సీడీవీ) వ్యాక్సిన్‌ను అటవీశాఖ దిగుమతి చేసుకుని, గిర్ అడవిలోని అన్ని సింహాలకు వాటిని వేసినట్లు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+