అయోధ్య వివాదం: సున్ని వక్ఫ్ బోర్డుపై ప్రధాని మోడీ ప్రశంసలు, ఎందుకంటే?
\న్యూఢిల్లీ: అయోధ్య వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ సందర్భంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అభినందనలు తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించారు.
2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ కేసు విచారణను వాయిదా వేయాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదన వినిపించడంపై సున్నీ వక్ఫ్ బోర్డు బుధవారంనాడు స్పందించింది. ఆయన వాదన సరైంది కాదని పేర్కొంది.

'కపిల్ సిబాల్ మా న్యాయవాదే. అయితే ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. కేసు విచారణను ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వాయిదా వేయాలన్న ఆయన వాదనతో మేము ఏకీభవించడం లేదు. సాధ్యమైనంత త్వరలో ఓ పరిష్కారం కావాలనే మేము కోరుకుంటున్నాం' అని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజీ మెహ్బూబ్ బుధవారం స్పష్టం చేశారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే మోడీ స్పందిస్తూ.. సున్నీ వక్ఫ్ బోర్డు వైఖరిని అభినందించారు. ఇప్పటికే కపిల్ సిబాల్ కాంగ్రెస్ ఏజెంట్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications