జయలలిత ఫ్యాన్స్: డబ్బులు విసిరేశారు (పిక్చర్స్)
చెన్నై: సుప్రీంకోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేయడంతో అన్నాడియంకె కార్యకర్తల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అమ్మ కోసం వారు నిరీక్షిస్తూ పెద్ద యెత్తున సంబరాలు చేసుకున్నారు. కొంత మంది ప్రజల మధ్యకు డబ్బులు కూడా విసిరేశారు. బాణసంచా పేల్చారు.
అన్నాడియంకె ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విషాదాన్ని వ్యక్తం చేస్తూ నల్లటి దుస్తులు ధరించిన కొంత మంది నాయకులు ఆమెకు బెయిల్ మంజూరైనట్లు వార్తలు రావడంతో ఉత్సాహంతో ఊగిపోయారు. అమ్మ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచాలు పేల్చి వేడుకలు చేసుకున్నారు.
అన్నాడియంకె కార్యకర్తలు దీపావళిని ముందుగానే జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడియంకె కార్యకర్తలు రామచంద్రన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

స్వీట్లు పంచిపెట్టారు...
జయలలితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజారు చేసిన వార్త అందగానే అన్నాడియంకె కార్యకర్తల్లో ఉత్సాహం అనుమడించింది. స్వీట్లు పంచుకున్నారు.

డబ్బులు వెదజల్లారు..
జయలలితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందనే వార్త రాగానే విల్లుపురంలోని అన్నాడియంకె కార్యకర్తలు ప్రజల్లోకి డబ్బులు వెదజల్లారు.

బాణసంచా పేల్చారు..
జయలలితకు బెయిల్ మంజూరు అయిందనే వార్త వెలువడగానే తమిళనాడు అంతటా వేడుకల వాతావరణం చోటు చేసుకుంది.

ఊరేగింపు...
జయలలిత చిత్రపటంలో అభిమానులు, అన్నాడియంకె కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించారు. ఆనందంతో గంతులేశారు.












Click it and Unblock the Notifications