బాలకృష్ణ: ‘మా ఇంట్లో ఆడవాళ్ల జోలికొస్తే చేతులు కట్టుకొని కూర్చొను.. ఇదే నా హెచ్చరిక’
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిమాణాలు, మాజీ సీఎం చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
"ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ దూషణలకు వేదికైంది. అసెంబ్లీలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, అది కూడా రాజకీయాలతో సంబంధం లేని వారిపై ఆరోపణలు చేయడం సరికాదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాలేదు.
ఇక్కడ ఊరికే చేతులు కట్టుకుని కూర్చోలేదు. మీదికొస్తే, మా ఆడవాళ్ల జోలికొస్తే, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అక్కడున్న ఇష్యూని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు.
- వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. 'మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
- 'చంద్రబాబుది ఓ డ్రామా.. ఆయన ఆరోపించినట్లు ఆ మాటలు అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదు’ - వైఎస్ జగన్
ఆ సమస్య నుంచి దృష్టిమరల్చేందుకే-బాలకృష్ణ
ఒక అంశంలో తమ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తమకు అనుమానంగా ఉందంటూ స్వయంగా వాళ్ల కుటుంబ సభ్యులే చెప్పారు. అది సమస్య.
దాన్నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇంత నీచంగా నోరు పారేసుకోవడం, వాళ్ల ఆహార్యం, వాచకం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
అసెంబ్లీ హూందాగా జరగాలి. సమస్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేసుకోవడం తప్పు కాదు. కానీ రాజకీయాలతో సంబంధం లేని ఇంటి ఆడవాళ్లపై వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదు.
మెడలు వంచి మారుస్తాం-బాలకృష్ణ
మంచి సలహాలు ఇస్తే తీసుకోరు. ప్రతి దానికి ఏదో ఒక వంక పెడతారు. దానికొక సందర్భంగా తీసుకురావడం, దాన్ని డైవర్ట్ చేయడం... ఇది మంచి సంస్కృతి కాదు.
అది మంచిది కాదని మేము మీకు హితోపదేశం చేయడం కాదు, మీరు మనుషులు కాదు. మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం.
టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడే మాట్లాడుదామనుకున్నాం. కానీ చంద్రబాబు వద్దన్నారు. కానీ దానికీ ఒక హద్దు ఉంటుంది.
ఇక జరిగిందానికి ఉపేక్షించేది లేదు. ఇక ఎవరు నోరు తెరిచినా సరే.. ఏదైనా ఉంటే ఇష్యూ మీద మాట్లాడండి. అంతేగానీ ఇంట్లోని ఆడవాళ్లపై, రాజకీయాలతో సంబంధం లేని వారిపై విమర్శలు చేయడం సరికాదు.
ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక చంద్రబాబు నాయుడి అనుమతి మాకు అవసరం లేదు. ఇంతకుముందు మేము సహనం పాటించామంటే అది ఆయన వల్లే. ఆయన మీకిచ్చే గౌరవం వల్ల. ఇదే నా హెచ్చరిక.
ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి, నా అభిమానుల నుంచి, మా కుటుంబం నుంచి ఇది నా హెచ్చరిక. మళ్లీ ఇటువంటి నీచమైన పదాలు వాడితే సహించేది లేదు. ఒక్కొక్కరి భరతం పడతాను. దేనికైనా ఒక హద్దు ఉంటుంది" అని బాలకృష్ణ అన్నారు.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: లాజిస్టిక్స్ సూచీలో తెలుగు రాష్ట్రాల ర్యాంకులు ఎందుకు దిగజారాయి?
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
చంద్రబాబు చెప్పింది నమ్మి మాట్లాడుతున్నారు- పేర్ని నాని
బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు.
"అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే రాలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరూ కూడా.. వారి పేరుగానీ, విషయ ప్రస్తావనగానీ, పల్లెత్తు మాట కూడా అనలేదని నమ్మండి. చంద్రబాబు చెప్పేవి అసత్యాలు. జరగని విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.
అనని మాటలను అన్నట్లుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నమ్మించారు. చంద్రబాబు మాటలను బలంగా నమ్మే వాళ్లు మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. ఇది బాధాకరం" అని మంత్రి పేర్ని నాని చెప్పారు.
"అనని మాటలను ఇద్దరు నేతలకు ఆపాదించి వైసీపీపై రాజకీయంగా పైచేయి సాధించాలని, జగన్ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయడానికి చంద్రబాబు చేస్తున్న దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇది" అని ఆయన అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- హిందూ-ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీలపై దాడులు చేసినప్పుడు... - దృక్కోణం
- 'స్త్రీ, పురుష జననేంద్రియాలతో పుట్టాను.. ఇప్పుడు మహిళగా మారాను.. దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది’
- కాన్పు సమయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే తల్లీబిడ్డలకు రక్ష
- కమలా హారిస్: అమెరికా ప్రెసిడెంట్ అధికారాలు పొందిన తొలి మహిళ
- 'జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)