ప్రచారంలో ఆలయాలకు వెళ్లేవారిని నిషేధించండి.. ! మాయావతి
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో నేతల ప్రచారం పీక్ స్థాయికి చేరింది. ఎన్నికల్లో నిర్మాణాత్మక సమస్యలను పక్కన పెట్టి మతాలు, కులాలతోపాటు ,వ్వక్తిగత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార బీజేపీని కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు ప్రయాత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా హిందుత్వ, నాన్ హిందుత్వ గ్రూపుల మధ్య విమర్శల బాణాలు విరుచుకుపడుతున్నాయి.
ఇక తాజాగా ఆ కోవలోకి బీఎస్పీ చీఫ్ మాయావతి చేరారు. లక్నోలో మీడీయాతో మాట్లాడిన ఆమే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలయాలకు వెళ్లే నాయకులను అడ్డుకోవాలని, వారిని ఆలయాలకు వెళ్లకుండా నిషేధించాలని ఆమే ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆలయాకు వెళ్లడం కూడ ఎన్నికల నిబంధల కిందకే వస్తుందని ఆమే స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేయడంతో పాటు గుళ్లకు వెళ్లడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ గా మారిపోయిందని మాయవతి అన్నారు.
కాగా ఇలా ప్రచారం చేస్తూ గుళ్లోకి వెళ్లే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడ ఆమే ఎన్నికల సంఘాన్ని కోరడంతోపాటు అభ్యర్థి ఖర్చును వారి ఖాతాల్లో వేయాలని కోరారు. ఇక మీడియా సైతం ఆలయాల సందర్శనకు వెళ్లే వారి కవరేజ్ను చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ఆసూచించారు.
సోమవారం రాత్రి సినీనటుటు, ఎంఎన్ఎం పార్టీ నేత కమలహాసన్ స్వతంత్ర్ర్య భారత దేశ తొలి తీవ్రవాదీ ఒక హిందువేనంటూ.. గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను ఉద్దేశించి అన్నారు. దీంతో అటు హిందువాదులు వ్యతిరేక వాదులకు మధ్య పోలిటికల్ వార్ మొదలైన విషయం తెలిసిందే..