Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతులకు వలపు వలవేసి .. భారత్ పై భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ

బంగ్లాదేశ్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ చేసిన ఉగ్రకుట్రను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. భారతీయ యువతులను పెళ్లి ముసుగులో ముగ్గులోకి దించి వారి కుటుంబ సభ్యులను సంస్థలో చేర్చుకోవడానికి జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కుట్రలు చేస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షాకింగ్ విషయాన్ని గుర్తించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో 2014 లో బుర్ద్వాన్ బాంబు పేలుడు తర్వాత ఏజెన్సీ దృష్టిని ఆకర్షించిన జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB), భారతదేశంలో కొత్త సభ్యుల నియామకానికి భిన్నమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేసినట్లు కనుగొంది.

భారతీయ మహిళలను వివాహం .. ఆపై వారి కుటుంబాలు కూడా ఉగ్రవాదంలోకి

భారతీయ మహిళలను వివాహం .. ఆపై వారి కుటుంబాలు కూడా ఉగ్రవాదంలోకి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రకారం, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కేడర్‌లు తమ కుటుంబ సభ్యులను టెర్రర్ గ్రూప్‌లో చేర్చుకోవడానికి భారతీయ మహిళలను వివాహం చేసుకునేవారని నివేదించింది.బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసులను దర్యాప్తు చేస్తున్నదని ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తించిందని వెల్లడించింది. 2014 నుండి జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ చురుకుగా పనిచేస్తోందని, కానీ బుర్ద్వాన్ బాంబు దాడి తర్వాతనే ఈ ఉగ్రవాద సంస్థ అందరి దృష్టిని ఆకర్షించిందని దర్యాప్తు బృంద సభ్యుడు వెల్లడించినట్టు సమాచారం.

 బుర్ద్వాన్ బాంబు పేలుడు ఘటన తర్వాత జమాతుల్ ముజాహిదీన్ పై ఫోకస్

బుర్ద్వాన్ బాంబు పేలుడు ఘటన తర్వాత జమాతుల్ ముజాహిదీన్ పై ఫోకస్

అక్టోబర్ 2, 2014 న, పశ్చిమ బెంగాల్ తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని రద్దీగా ఉండే ఖగ్రాఘర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటి మొదటి అంతస్తులో బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఈ కేసులో విచారణ జరిపిన ఎన్ఐ ఏ పలువురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో, పశ్చిమ బెంగాల్ పోలీసులు 55 మెరుగైన పేలుడు పరికరాలు, మరికొన్ని పేలుడు పదార్థాలు, చేతి గడియారాల డయల్స్ మరియు కొన్ని మొబైల్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 10, 2014 న, ఎన్ఐఏ పేలుడు కేసు దర్యాప్తును చేపట్టింది.

జేఏంబీ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. రిక్రూట్ మెంట్స్ కు కొత్త ప్లాన్ గుర్తింపు

జేఏంబీ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. రిక్రూట్ మెంట్స్ కు కొత్త ప్లాన్ గుర్తింపు

జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ కేసుకు సంబంధించి యాంటీ-టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ దర్యాప్తులో భాగంగా, తీవ్రవాద చర్యలకు పాల్పడినందుకు మరియు ఇండియా మరియు బంగ్లాదేశ్‌పై యుద్ధం చేసినందుకు ఈ ఉగ్రవాద సంస్థ కి వ్యతిరేకంగా అనేక ఛార్జ్‌షీట్లు దాఖలు చేయబడ్డాయి. ఇక ఆ తర్వాత భారతదేశంలో రిక్రూట్మెంట్ ను వేగవంతం చేసేందుకు ఉగ్రవాద సంస్థ సభ్యులు నియామక వ్యూహాన్ని మొదలుపెట్టారని, అట్టడుగున ఉన్న పేద యువతులను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. భారతీయ అమ్మాయిలతో క్యాడర్ సభ్యులు వివాహం చేసుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులను ఉగ్రవాద కార్యకలాపాలను సభ్యులుగా మారుస్తున్నారని గుర్తించారు.

మదర్సా ల ద్వారా అమ్మాయిలకు వలపు వల.. ఆపై పెళ్ళితో ఉగ్రవాదంలోకి

మదర్సా ల ద్వారా అమ్మాయిలకు వలపు వల.. ఆపై పెళ్ళితో ఉగ్రవాదంలోకి

పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ క్యాడర్‌లు మదరసాలను నడిపేవారని , అక్కడ నుండి, వారు వివాహం కోసం అమ్మాయిలను గుర్తించి, క్యాడర్‌లతో యువతులకు వివాహం తరువాత, వారి కుటుంబ సభ్యులను కూడా ఉగ్రవాద గ్రూపులలో నియమిస్తున్నట్లు గా గుర్తించారు. కొన్ని కేసులను స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున ఉగ్రవాద క్యాడర్‌లను వివాహం చేసుకున్న బాలికల సంఖ్య ప్రస్తుతం తెలియదని చెబుతున్నట్టు సమాచారం .

భారత్ లో సభ్యులుగా చేర్చుకున్న వారికి ట్రైనింగ్ ఇస్తున్న జేఏంబీ

భారత్ లో సభ్యులుగా చేర్చుకున్న వారికి ట్రైనింగ్ ఇస్తున్న జేఏంబీ

కోల్‌కతాలోని ఎన్‌ఐఏ కోర్టు బంగ్లాదేశీయుడైన జెఎమ్‌బి చీఫ్ జాహిదుల్ ఇస్లామ్ అలియాస్ కౌసర్‌కు ఫిబ్రవరిలో ఈ కేసుకు సంబంధించి రూ. 35,000 జరిమానాతో 29 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ఈ రోజు వరకు నిర్వహించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ కార్యకర్తలు తీవ్రవాద చర్యలకు పాల్పడటం కోసం, భారత మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలపై యుద్ధం చేయడం కోసం భారతదేశంలోని తమ సభ్యులకు పేలుడు పదార్థాలు మరియు ఆయుధాలలో రాడికల్, రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణ అందించడానికి కుట్ర పన్నారని వెల్లడైంది.

జేఏంబీ ఉగ్రవాద సంస్థ కేసుల విచారణలో ఎన్ఐ ఏ .. 33 మందిపై కేసులు

జేఏంబీ ఉగ్రవాద సంస్థ కేసుల విచారణలో ఎన్ఐ ఏ .. 33 మందిపై కేసులు

విచారణలో శిక్షణకు సంబంధించి హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు మరియు శిక్షణ వీడియోలను కూడా స్వాధీనం చేసుకుందని తెలుస్తుంది. విస్తృతమైన దర్యాప్తు ఫలితంగా, ఈ కేసులో చేసిన వివిధ నేరాలకు సంబంధించి 33 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభియోగాలు నమోదు చేసింది. 33 మంది నిందితుల్లో 31 మందిని అరెస్టు చేశారు. కోల్‌కతాలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గతంలో 30 మంది నిందితులను దోషులుగా నిర్ధారించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+