బియాస్ ట్రాజెడీ: రామన్న విజ్ఞప్తి, వీరభద్ర తోసివేత
సిమ్లా: బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల స్మారకాన్ని సంఘటనా స్థలంలో నిర్మించాలనే తెలంగాణ అటవీ శాఖ మంత్రి విజ్ఢప్తిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తోసిపుచ్చారు. జూన్ 8వ తేదీన 24 మంది హైదరాబాద్ విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.
కావాలంటే ఫలకాన్ని ఉంచగలమని వీరభద్ర సింగ్ మంగళవారంనాడు చెప్పారు. గల్లంతైన విద్యార్థుల గాలింపు చర్యలను పాండో డ్యామ్ వద్ద పర్యవేక్షిస్తున్న మంత్రి జోగు రామన్న విద్యార్థుల స్మారకాన్ని ఇక్కడ నిర్మించాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.

జరిగింది దారుణమేనని, అయితే గతంలో కూడా ప్రమాదాల జరిగాయని, ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ప్రతి సంఘటనకూ స్మారకాలను నిర్మించలేమని, కావాలంటే ఫలకం పెట్టడానికి అంగీకరిస్తామని వీరభద్ర సింగ్ అన్నారు.
గల్లంతైన విద్యార్థుల కోసం శక్తి మించి పనిచేశామని, 800 మంది గాలింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు 17 శవాలు లభించాయని ఆయన చెప్పారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications