Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Beauty business: అమ్మాయిలు, ఆంటీలు పెట్టుబడి, లాక్ డౌన్ లో భర్తలు లక్షాధికారులు !

జైపూర్/చెన్నై/హైదరాబాద్: కొన్ని గ్రామాల్లోని అమ్మాయిలు, ఆంటీలు, వారి భర్తలు, బంధువులు కలిసి పెట్టుబడి లేని వ్యాపారం చేశారు. మొబైల్ ఫోన్లు, వారి తెలివితేటలు, వారి అందచందాలను సోషల్ మీడియాలో పెట్టుబడిగా పెట్టి లక్షల రూపాయలు సంపాధించారు. ఆరు నెలల్లోనే అందరూ లక్షాధికారులు అయిపోయారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులను టార్గెట్ చేసుకుని అమ్మాయిలు, ఆంటీలు వారి అందాలను ఆరబోసి వీడియో కాల్స్ లోనే ఎదుటివారికి స్వర్గం చూపించారు. సోల్లు కార్చుకున్న తింగరోళ్లు ఇప్పటి వరకు లక్షల రూపాయలు వారికి సమర్పించుకున్నారు. అంతేకాకుండా మనోళ్లు వారి నగ్న ఫోటోలు వీడియోలను అమ్మాయిలు, ఆంటీలకు పంపించారు. మీ ధరిద్రాన్ని మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆరు నెలల్లో 72 మంది మేము అమ్మాయిలు, ఆంటీల చేతిలో మోసపోయామని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు .ఇందులో లాక్ డౌన్-2 సమయంలోనే 36 బ్లాక్ మెయిల్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది.

28 గ్రామాల కిలాడీల స్కెచ్

28 గ్రామాల కిలాడీల స్కెచ్

రాజస్థాన్ లోని 20 గ్రామాలు, హర్యానాలోని 8 గ్రామాల ప్రజలకు ఎవ్వరూ ఊహించలేని తెలితేటలు వచ్చేశాయి. గ్రామంలో నివాసం ఉంటున్న యువతులు, వివాహిత మహిళలు, ఆంటీలను పెట్టుబడిగా పెట్టిన గ్రామస్తులు పెట్టుబడిలేని వ్యాపారం చెయ్యాలని అందరూ కలిసి స్కెచ్ వేశారు.

 సోషల్ మీడియాలో పరిచయాలు

సోషల్ మీడియాలో పరిచయాలు

సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్స్ లో కొంత మంది అమ్మాయిలు, వివాహిత మహిళలు అనేక మందిని పరిచయం చేసుకున్నారు. ఫేస్ బుక్ లో రిక్వెస్టులు పెట్టి వారితో పరిచయం పెంచుకున్నారు. మిమ్మల్ని శుభకార్యాల్లో చూశామని, ఆ పెళ్లిలో మీరు కనపడ్డారని, మీరు చాలా అందంగా ఉంటారని, మీతో మాట్లాడాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నానని అమ్మాయిలు ఎదుటివాళ్లకు తియ్యటి మాటలు చెప్పారు.

 రాజకీయ నాయకులు, శ్రీమంతులు, విద్యార్థులు

రాజకీయ నాయకులు, శ్రీమంతులు, విద్యార్థులు

రాజస్థాన్ లోని భరత్ పూర్, హింగోటా, గంగ్ పురి, కామా, తోడా, దుండాబబల్ తో పాటు మొత్తం 20 గ్రామాల ప్రజలు, హర్యానాలోని 8 గ్రామాల్లోని అమ్మాయిలు, ఆంటీలు, వారి భర్తలు, బంధువులు కలిసి పెట్టుబడి లేని వ్యాపారం చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులను టార్గెట్ చేసుకున్న అమ్మాయిలు, ఆంటీలు వారి అందాలను ఆరబోసి వీడియో కాల్స్ లోనే ఎదుటి వారికి స్వర్గం చూపించారు.

 ఎర్రతోలు చూసి రెచ్చిపోయిన పోటుగాళ్లు

ఎర్రతోలు చూసి రెచ్చిపోయిన పోటుగాళ్లు

రాజస్థాన్ లో అమ్మాయిలు, ఆంటీలు ఏరైంజ్ లో ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. ఎర్రగా, బుర్రగా, అప్పుడే చెట్టు నుంచి కోసిన యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, ఆంటీలు, సన్నగా నాజుకుగా ఉన్న అమ్మాయిలను చూసి సోల్లు కార్చుకున్న తింగరోళ్లు వాళ్లు కూడా నగ్నంగా వీడియో కాల్స్ చెయ్యడం, నగ్న ఫోటోలు పంపించడం మొదలుపెట్టారు. కొంతకాలం ఈతతంగం మొత్తం సోషల్ మీడియాలోనే జరిగింది.

అడిగింది ఇస్తావా...... చస్తావా.... మా పని మేము చేస్తాం

అడిగింది ఇస్తావా...... చస్తావా.... మా పని మేము చేస్తాం

కొంతకాలం ఎదుటివారితో మంచిగా ఉంటున్న అమ్మాయిలు, ఆంటీలు తరువాత వారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు. మేము అడిగినంత డబ్బులు ఇస్తారా, లేదంటే మీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. పరువు పోతుందని భయపడిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు లక్షల రూపాయలు, రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు ఇలా వారి స్థాయినిబట్టి సమర్పించుకున్నారు.

 మొత్తం 72 కేసులు, లాక్ డౌన్ లో 36 కేసులు

మొత్తం 72 కేసులు, లాక్ డౌన్ లో 36 కేసులు

అమ్మాయిలు, ఆంటీలను చూసి సోల్లు కార్చుకున్న తింగరోళ్లు ఇప్పటి వరకు లక్షల రూపాయలు వారికి సమర్పించుకున్నారు. అంతేకాకుండా వాళ్ల నగ్న ఫోటోలు వీడియోలను అమ్మాయిలు, ఆంటీలకు పంపించి ఇప్పుడు లభోదిబో అంటున్నారు. మీ నగ్న ఫోటోలు, వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసిన అమ్మాయిలు వారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆరు నెలల్లో 72 మంది అమ్మాయిలు, ఆంటీల చేతిలో మోసపోయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు .ఇందులో లాక్ డౌన్ సమయంలోనే 36 బ్లాక్ మెయిల్ కేసులు వెలుగులోకి రావడంతో పోలీసులు హడలిపోయారు.

Recommended Video

    Himaja With Pawan Kalyan In PSPK 27 || Oneindia Telugu
    ఆ ఊరి పేర్లు చెబితే పోలీసులకే హడల్...... ఎమ్మెల్యే అండ ?

    ఆ ఊరి పేర్లు చెబితే పోలీసులకే హడల్...... ఎమ్మెల్యే అండ ?

    రాజస్థాన్ లో ఇలా బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న 20 గ్రామాల్లో ముస్లీం మెజారిటీ కుటంబాలు ఉంటున్నాయి. ఆ గ్రామాల్లో అడుగుపెట్టాలంటే పోలీసులు సాహసం చెయ్యడం లేదని ఆరోపణలు ఉన్నాయి. స్థానికులకు అక్కడి ఎమ్మెల్యే కూడా ఫుల్ సపోర్టు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. OLXలో తక్కువ ధరకు కార్లు అమ్ముతామని రూ. లక్షలు వసూలు చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఇలా మోసపోయిన వాళ్లు ఒక్కసారిగా 72 కేసులు పెట్టడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని 28 గ్రామాల ప్రజలు లక్షాధికారులు అయిపోయారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+