గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ దెబ్బ, ఏసీపీలు బదిలి: రూ. 600 కోట్లు చీటింగ్ కేసు, అనుమానాలు
Recommended Video

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీ వెంకటేష్ ప్రసన్నను బదిలి చేస్తూ పై అధికారులు ఆదేశారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణలో ఉండగానే ఏసీపీ వెంటకేష్ ప్రసన్న బదిలి కావడంతో సాటి అధికారులు షాక్ కు గురైనారు. గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ ముందస్తు బెయిల్ ను కోర్టు రద్దు చేసింది. సీసీబీ అధికారులు బదిలి కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

జైలుకు గాలి
బెంగళూరు సీసీబీ విభాగం ఏసీపీగా పని చేస్తున్న వెంకటేష్ ప్రసన్న బెంగళూరు సీసీఆర్ బి విభాగానికి బదిలి అయ్యారు. ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఈనెల 11వ తేదీన అరెస్టు అయ్యారు.

గాలికి బెయిల్, అధికారులు బదిలి
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ విభాగం ఏసీపీలు మంజునాథ్ చౌధరి, పీటీ. సుబ్రమణ్య, మరియప్పలను పై అధికారులు బదిలి చేశారు.

రూ. వందల కోట్లు చీటింగ్
సుమారు రూ. 600 కోట్లకు పైగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని ఆంబిడెంట్ కంపెనీ మీద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కర్ణాకట మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని సీసీబీ పోలీసు అధికారులు విచారణ చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ మొత్తం ఏసీపీ వెంకటేశ్ ప్రసన్న ఆధ్వర్యంలోనే జరిగింది.

ముందస్తు బెయిల్ రద్దు
గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంతో సీసీబీ అధికారుల మీద వేటు పడింది. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులోనే విచారణ ఎదుర్కొంటున్న ఆయన సన్నిహితుడు ఆలీఖాన్ ముందస్తు బెయిల్ ను బెంగళూరు 61వ సిటీ పివిల్ కోర్టు మంగళవారం రద్దు చేసింది.

బదిలిపై అనుమానాలు
ముందస్తు బెయిల్ ను కోర్టు రద్దు చెయ్యడంతో ఆలీఖాన్ 1వ ఏసీసీ న్యాయస్థానం ముందు లొంగిపోయాడు. ఆలీఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వందల రూపాయల కోట్ల చీటింగ్ కేసు విచారణ చేస్తున్న అధికారులను ఒక్కసారిగా బదిలి చెయ్యడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications