కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, మాజీ మావోయిస్టు విచారణ, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు !
బెంగళూరు: ప్రముఖ కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో పోలీసులు ఓ మాజీ మావోయిస్టును విచారణ చేసి వివరాలు సేకరించారని వెలుగు చూసింది. చిక్కమగళూరు జిల్లా కోప్ప తాలుకా బాళగడి గ్రామంలో గురువారం అర్దరాత్రి మాజీ మావోయిస్టు నీలగుణి పద్మనాభ్ ను విచారణ చేశారని సమాచారం.
చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్ పురం తాలుకాలో బుధవారం పద్మనాభ్ ఆధార్ కార్డు చేయించుకోవడానికి వెళ్లారు. తరువాత పని ముగించుకున్న పద్మనాభ్ బాళగడి గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు.

తరువాత బాళగడి గ్రామానికి వెళ్లిన కోప్ప పోలీసులు పద్మనాభ్ ను ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పద్మనాభ్ ను విచారణ చేసిన పోలీసులు అతని మొబైల్ ఫోన్ తీసుకుని అందులోని నెంబర్లు మొత్తం నోట్ చేసుకుని వెళ్లారని సమాచారం.
కోప్ప పోలీసుల తీరుపై గురువారం పద్మనాభ్ భార్య రేణుక మండిపడ్డారు. ప్రజాస్రవంతిలో కలిసిపోయిన తన భర్త పద్మనాభ్ ను పోలీసులు వేధిస్తున్నారని రేణుక ఆరోపించారు. ఓ టీవీ చానల్ లో చర్చాగోష్టి కార్యక్రమానికి తన భర్తను గౌరీ లంకేష్ తీసుకెళ్లారని, ఆ విషయం అడ్డం పెట్టుకుని ఇప్పుడు తన భర్త పద్మనాభ్ ను పోలీసులు వేధిస్తున్నారని రేణుక ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications