బెంగళూరు జయనగర అసెంబ్లీ ఎన్నికలు: చిరుజల్లుల్లో ఓటింగ్, కాంగ్రెస్, బీజేపీ బిగ్ ఫైట్ !
బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర శాసన సభ నియోజక వర్గం ఎన్నికలు జూన్ 11వ తేదీ సోమవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎస్. విజయ్ కుమార్ ఆకస్మికమరణంతో మే 12వ తేదీ జరగవలసిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
జయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే బిఎస్. విజయ్ కుమార్ సోదరుడు బిఎన్. ప్రహ్లాద్, కాంగ్రెైస్ అభ్యర్థిగా కర్ణాటక మాజీ హొం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి పోటీ చేస్తున్నారు.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యా రెడ్డికి మద్దతు ఇస్తోంది. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రవికృష్ణా రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తం 19 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. జయనగర నియోజక వర్గంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది.
జయనగర్ శాసన సభ నియోక వర్గంలో మొత్తం 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి బిఎన్. ప్రహ్లాద్ రాణి చెన్నమ్మ స్టేడియంలోని పోలింగ్ కేంద్రంలో క్యూలైన్ లో నిలబడి ఓట హక్కు వినియోగించుకున్నారు.
జయనగర 4వ Tబ్లాక్ లోని 52వ పోలింగ్ బూత్ లో ప్రముఖ సీనియర్ టి భారతీ విష్ణువర్దన్, సాహితేవత్త, సినీ దర్శకుడ బరుగూరు రామచంద్రప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications